News April 5, 2024

నెల్లూరు: CM జగన్ ఏం చెప్పనున్నారు?

image

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీరంతా ఒకప్పుడు CM జగన్‌కు నమ్మిన వ్యక్తులు. వీళ్లంతా TDP గూటికి చేరారు. ఇందులో వేమిరెడ్డి, కోటంరెడ్డి YCP అభ్యర్థులతో ఎన్నికల్లో తలపడనున్నారు. బస్సు యాత్రలో భాగంగా జగన్ నెల్లూరుకు వచ్చారు. ఇవాళ అంతా ఆయన నెల్లూరులోనే ఉంటారు. మరి ఆయా నేతలను ఎదుర్కొనేలా జగన్ ఆ పార్టీ నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో చూడాలి మరి.

Similar News

News October 15, 2025

నెల్లూరులో మరోసారి యూరియా కొరత..?

image

నెల్లూరు జిల్లాలో రైతులకు ఎకరాకు 3బస్తాల చొప్పున యూరియానే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 6బస్తాలు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన 94 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. అధికారులు 74 వేల మెట్రిక్ టన్నులకే ప్రతిపాదనలు పంపారు. 20వేల మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడితే యూరియా కోసం రైతులు అవస్థలు పడక తప్పదు.

News October 15, 2025

సంగం టీచర్, విద్యార్థికి అరుదైన అవకాశం

image

నెల్లూరు జిల్లా సంగం జడ్పీ స్కూల్ సోషల్ టీచర్ సుబ్రహ్మణ్యం, పదో తరగతి విద్యార్థి యశ్వంత్‌కు అరుదైన అవకాశం దక్కింది. కర్నూలులో పీఎం మోదీ ఆధ్వర్యంలో గురువారం జరగనున్న జీఎస్టీ రీఫార్మ్ 2.0 సభకు వీరిద్దరూ ఎంపికయ్యారు. జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను ప్రధాని సభా ప్రాంగణంలో వీరిద్దరూ వివరించనున్నారు. ఈక్రమంలో కర్నూలుకు బయల్దేరి వెళ్లారు.

News October 15, 2025

తహశీల్దార్ ఫిర్యాదు FIR కాలేదు ఎందుకో.?

image

తనపై దౌర్జన్యం జరిగిందని లింగసముద్రం తహశీల్దార్ స్వయంగా ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు అదేరోజు FIR ఎందుకు చేయలేదన్న విమర్శలు చెలరేగుతున్నాయి. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న అధికారి ఫిర్యాదు ఇస్తే అది కూడా FIR కాకపోవడం చర్చనీయాంశమైంది. లింగసముద్రం SI నారాయణ తీరు పట్ల తహశీల్దార్ సైతం అసహనం వ్యక్తం చేశారు. బాధితుల పట్ల పోలీసులు బాధ్యతగా వ్యవహరించకపోతే ఎలా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.