News July 27, 2024
నెల్లూరు KNR స్కూల్ లో తప్పు ఎవరిది?

నెల్లూరు స్కూల్ లో గోడ కూలి మహేంద్ర మృతి చెందిన ఈ ఘటనలో తప్పు ఎవరిది? నాడు-నేడు పనులను నాసిరకంగా చేపట్టడం తోపాటు నిధులు ఇవ్వక అర్ధంతరంగా పనులు ఆపించిన గత ప్రభుత్వ పాలకులదా? సగం పనులు జరిగిన భవనం వద్దకు పిల్లలను వెళ్లకుండా చూడాల్సిన బాధ్యతను విస్మరించిన ఉపాధ్యాయులదా!? ఇలా తప్పు ఎవరిదైనా ఆ తల్లికి మాత్రం పుత్రశోకం మిగిల్చింది. ఈ నిర్లక్ష్యానికి కారకులపై చర్యలు తీసుకోవాలని విద్యా సంఘాలు కోరాయి.
Similar News
News March 12, 2025
జిల్లాలో 75344 మంది లబ్ధిదారులకు ప్రయోజనం: కలెక్టర్

జిల్లాలో 75344 మంది లబ్ధిదారులకు రూ.1199.85 కోట్లు నిధులు మంజూరు చేశామని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. 2019-24 మధ్యకాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గృహాలు మంజూరై ఇంకను వివిధ దశలలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి అదనంగా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ మంగళవారం ఒక ప్రటకనలో తెలిపారు.
News March 11, 2025
గృహ నిర్మాణాలకు అదనంగా నగదు అందజేత

2019-24 మధ్యకాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గృహాలు మంజూరై ఇంకను వివిధ దశలలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి అదనంగా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అందజేస్తామన్నారు.
News March 11, 2025
నెల్లూరు: నేటి నుంచి శనగల కొనుగోలు రిజిస్ట్రేషన్లు

నెల్లూరు జిల్లాలోని శనగ పంటను ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించేందుకు నేటి నుంచి 20వ తేదీ వరకు రైతు సేవా కేంద్రాల్లో రైతులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జేసీ కార్తీక్ తెలిపారు. ప్రభుత్వం శనగను రూ.5,650 మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.