News April 2, 2025

నెల్లూరు : PM కిసాన్ లింక్ పేరిట మోసం

image

PM కిసాన్ పేరిట వాట్సాప్‌కు వచ్చిన ఓ ఫైల్‌ను ఓపెన్ చేయడంతో బ్యాంకు ఖాతాలోని నగదు మాయమైన ఘటన నెల్లూరులో జరిగింది. బాధితుని కథనం.. గోమతి నగర్‌కు చెందిన ప్రసాద్ రావుకు వాట్సాప్‌లో పీఎం కిసాన్ లింక్ వచ్చింది. అది ఓపెన్ చేశాడు. తర్వాత గత నెల 29న ఫోన్‌పే ఓపెన్ చేసి చూడగా.. మూడు సార్లు రూ. 2,59,970 డ్రా చేసినట్లు చూపించింది. దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇన్స్పెక్టర్ రోశయ్య దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 1, 2025

నెల్లూరు: మెడికల్ కాలేజీలో ఏం జరుగుతోంది..?

image

నెల్లూరు AC సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీలో వరుస సూసైడ్ కేసులు కలవరపెడుతున్నాయి. సరిగ్గా 2 నెలలకింద మెడికో విద్యార్థిని మృతి చెందగా.. తాజాగా మరో మెడికో మృతి చెందింది. అయితే హాస్టల్స్‌ విద్యార్థులపై పర్యవేక్షణ కొరవడిందా?. విద్యార్థులు హాస్టల్స్‌లో ఉన్నప్పుడే సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి?. వీటన్నింటిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, భద్రతా ప్రమాణాలు పాటించాలని పిల్లల తల్లిదండ్రులు వాపోయారు.

News December 1, 2025

నెల్లూరు: అసంతృప్తిలో కూటమి నాయకులు..!

image

నెల్లూరు జిల్లాలోని కూటమి నాయకుల్లో అసంతృప్తి చెలరేగుతోంది. అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి పనిచేసిన తమను మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి పనికి మంత్రులు, MLAలే కాంట్రాక్టర్లుగా మారుతున్నారని వాపోయారు. తమకంటూ ఏ పనులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాగే ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావం స్థానిక ఎన్నికలపై ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

News December 1, 2025

గూడూరులో దారుణం

image

భార్య, అత్త కలిసి భర్తపై వేడివేడి నూనె పోసిన ఘటన గూడూరు ఇందిరానగర్‌లో జరిగింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ భర్త వారం నుంచి గొడవలు పడుతున్నాడు. ఈక్రమంలో భర్త తన బిడ్డలను చూడటానికి గూడూరులోని ఇందిరానగర్‌కు వెళ్లాడు. వేడి నూనె తనపై పోసి చంపడానికి ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపించారు. బంధువులు అతడిని ఆసుపత్రికి తరలించారు.