News November 15, 2024
నెల్లూరు:11 మంది వెల్ఫేర్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో విధులు నిర్వర్తించే 11మంది వెల్ఫేర్ అసిస్టెంట్లకు గురువారం షోకాజ్ నోటీసులు అందజేసినట్లు ఎంపీడీవో వేణుగోపాలరావు తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి అవలంబించడంతో నోటీసులు అందజేయడం జరిగిందన్నారు. అలాంటివారు మూడు రోజుల్లోపు లిఖితపూర్వకంగా సంజాయిషీ అందజేయాలని ఆ నోటీసులో సూచించారు.
Similar News
News February 28, 2026
అన్నదాతకు రూ.25 వేల మద్దతు ధర వచ్చేనా.?

వరికి ఒక క్వింటా ₹2389 లెక్కన పుట్టి ధర ₹21330 వరకు A- గ్రేడ్ రకానికి ఇస్తుండగా సాధారణ రకానికి పుట్టి ధర ₹20,136 చొప్పున నిర్ణయించారు. అయితే కేంద్రాల్లో ధాన్యం విక్రాయించాలంటే తరుగులతో కొంత తీసేస్తుండగా గొనె సంచులు, రవాణా ఖర్చులు రైతులే భరించాల్సి ఉంది. దీంతో ఎకరాకు రూ.35-40 వేల వరకు ఖర్చు అవుతుండగా రైతుకు రూ.20 వేలు కూడా మిగలడం లేదు. ప్రభుత్వం పుట్టికి రూ.25 వేల మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరారు.
News February 28, 2026
నెల్లూరు: 3.45 లక్షల ఎకరాల్లో వరిసాగు.!

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధరలు దక్కడం లేదు. జిల్లాలో ఈ ఏడాది రబీలో 3.45 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి రానుంది. వచ్చే నెల నుంచి జిల్లాలో 161 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా.. 5 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
News February 27, 2026
UPSC అభ్యర్థులకు ట్యాబ్ల అందజేత

యూపీఎస్సీ(UPSC) పరీక్షల్లో ఉచిత శిక్షణకు ఎంపికైన నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్సీ అభ్యర్థులకు కలెక్టర్ హిమాన్సు శుక్లా అధ్యాయన సామాగ్రితో కూడిన డిజిటల్ ట్యాబ్లను అందజేశారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వీటిని అభ్యర్థులకు అందజేశారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులను ఆయన అభినందించారు.


