News May 11, 2024
నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు నేటితో ముగియనున్నాయి. ఈ మేరకు మరో 2 రోజులు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిబంధన ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారం ముగించాలి. శనివారం సాయంత్రం 6 గంటలకు అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోపాటు వైసీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా ముమ్మర ప్రచారం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మనజీ జిలానీ సమూన్ తెలిపారు.
Similar News
News February 19, 2025
మందస: పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య

మందస మండలం లోహరిబంధలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానికంగా 8వ తరగతి చదువుతుంది. మధ్యాహ్నం పాఠశాలలో భోజనం అనంతరం సమీపంలోని జీడీ తోటలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
News February 19, 2025
SKLM: ‘ఆవుపాలు ధర పెంచాలి’

తగ్గించిన ఆవుపాలు ధర పెంచాలని.. కనీస వెన్న శాతాన్ని 2.8 శాతం నుంచి 3.1 శాతానికి పెంచడాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్య నారాయణ డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని రైతు సంఘ కార్యాలయంలో బుధవారం పాల రైతులతో సమావేశం జరిగింది. 30 లీటర్ల కంటే తక్కువ పాలు పోసిన సెంటర్లను ఆపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
News February 19, 2025
కృష్ణా యూనివర్సిటీ వీసీగా పొందూరు వాసి

పొందూరు మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన కూన రాంజీ విజయవాడలోని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్గా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు విడుదలయ్యాయి. గతంలో ఆయన ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. ఈయన నియామకంపై పొందూరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.