News August 19, 2024

నేటి నుంచి ఇంజినీరింగ్ చివరి విడత కౌన్సెలింగ్ 

image

ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి చివరి విడత కౌన్సెలింగ్  షెడ్యూల్ ప్రకారం జరగనుంది. ఈ సందర్భంగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ ఆన్‌లైన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈనెల 22 వరకు వెబ్ ఆప్షన్‌కు అవకాశం కల్పించారు. 23న ఆప్షన్లను మార్పు చేసుకోవచ్చు. 26న అలాట్మెంట్లను ప్రకటిస్తారు. 30 లోపు కళాశాలలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది.

Similar News

News December 4, 2025

ఈనెల 7న NMMS ప్రతిభా పరీక్ష: DEO

image

ఈనెల 7న NMMS ప్రతిభ పరీక్ష ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి కే.రవిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రెవెన్యూ డివిజన్లలోని 25 కేంద్రాల్లో పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షకు 5,627 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందించాలని కోరారు.

News December 4, 2025

SKLM: ‘ఆలయాల్లో దొంగతనాలు చేసిన ముగ్గురి అరెస్ట్’

image

జిల్లాలో పలు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1,71,000 స్వాధీనం చేసుకున్నట్లు శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద గురువారం వెల్లడించారు. డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. ఈ ముగ్గురూ గతంలో ఆముదాలవలసలో మోటార్ బైకుల దొంగతనం కేసులో 45 రోజులు జైలు శిక్ష అనుభవించినట్లు కూడా డీఎస్పీ వెల్లడించారు.

News December 4, 2025

శ్రీకాకుళం: ‘గ్రామ ప్రగతికి ప్రత్యేక చర్యలు’

image

ప్రభుత్వం గ్రామ ప్రగతికి ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. గ్రామ సచివాలయాల అడ్మినిస్ట్రేషన్‌కు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీడీఓ ) వ్యవస్థను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం రాష్ట్రం యూనిట్‌ను వర్చువల్‌గా ప్రారంభిస్తున్నారు. శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ భాగం ఏర్పాటు చేశారు. డీడీఓగా అరుంధతి దేవిని నియమించారు. జిల్లాలో 657 గ్రామ సచివాలయాలు ఈ పరిధిలోకి వస్తాయి.