News January 23, 2025

నేటి నుంచి జాన్ పహాడ్ దర్గా ఉర్సు 

image

జాన్ పహాడ్ దర్గా ఉర్సు నేటి నుంచి 25వ తేదీ వరకు జరగనుంది. మూడు రోజులపాటు నేరేడుచర్ల నుంచి జాన్ పహాడ్ వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు కోదాడ డిపో మేనేజర్ శ్రీ హర్ష గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దలకు ఛార్జీ రూ.40, పిల్లలకు రూ.20గా నిర్ణయించామన్నారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గం ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

Similar News

News September 19, 2025

ఖమ్మం: సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించిన కలెక్టర్

image

రాపర్తి నగర్‌లోని TGMRJC బాలికల జూనియర్ కళాశాలలో నిట్, ఐఐటీ ఆశావహ విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. లైబ్రరీ, తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థినులు, తల్లిదండ్రులతో ఆత్మీయంగా మాట్లాడి తన అనుభవాలను పంచుకున్నారు. ఇంటర్‌లో కృషి చేస్తే మంచి కెరీర్ సాధ్యమని, పోటీ పరీక్షల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

News September 19, 2025

భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్: పరవాడ సీఐ

image

పరవాడ మండలం జలారిపేటలో ఈనెల 17న భార్యను కత్తితో పొడిచి చంపిన ఘటనలో భర్త ఒలిశెట్టి కొండను గురువారం అరెస్టు చేసినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. నిందితుడు పరవాడ మండలం వెన్నెలపాలెంలో సంచరిస్తున్నాడని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. అనంతరం అనకాపల్లి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.

News September 19, 2025

VJA: దుర్గగుడి ఛైర్మన్ నియామకంపై తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి

image

దుర్గగుడి ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్‌గా బాలకృష్ణ అభిమాని బొర్రా గాంధీని నియమించడంపై స్థానిక TDP నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. YCP పాలనలో కేసులను ఎదుర్కొని, పార్టీ కోసం కష్టపడిన కీలక నేతలకు పదవి దక్కుతుందని ఆశించారు. అయితే, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా లేని గాంధీకి బాలకృష్ణ సిఫార్సుతోనే పదవి లభించిందని జిల్లా TDP నేతలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.