News January 23, 2025

నేటి నుంచి జాన్ పహాడ్ దర్గా ఉర్సు 

image

జాన్ పహాడ్ దర్గా ఉర్సు నేటి నుంచి 25వ తేదీ వరకు జరగనుంది. మూడు రోజులపాటు నేరేడుచర్ల నుంచి జాన్ పహాడ్ వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు కోదాడ డిపో మేనేజర్ శ్రీ హర్ష గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దలకు ఛార్జీ రూ.40, పిల్లలకు రూ.20గా నిర్ణయించామన్నారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గం ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

Similar News

News December 17, 2025

ఖమ్మంలో తుది విడత ఎన్నికలు.. 9AM UPDATE

image

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 7 మండలాలు కలిపి ఉ.9 గంటల వరకు 27.45% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.
☆ ఏన్కూరు-25.24%
☆ కల్లూరు- 28.33%
☆ పెనుబల్లి-31.52%
☆ సత్తుపల్లి- 23.63%
☆ సింగరేణి-25.71%
☆ తల్లాడ- 28.55%
☆ వేంసూరు- 27.38%
◇ ఎన్నికల అప్డేట్ కోసం WAY2NEWS ను చూస్తూ ఉండండి.

News December 17, 2025

ఖమ్మం: ‘ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి’

image

ఖమ్మం జిల్లా గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి ప్రవేశాల కోసం TG-CET 2026 నిర్వహించనున్నట్లు DCO సిహెచ్.జ్యోతి తెలిపారు. పరీక్ష ఫిబ్రవరి 22 (ఆదివారం) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఉచిత విద్య, వసతి, భోజనం అందించే ఈ గురుకులాల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు జనవరి 21వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

News December 17, 2025

MRO హబ్‌గా భోగాపురం అభివృద్ధి: రామ్మోహన్ నాయుడు

image

భోగాపురాన్ని సౌత్ ఈస్ట్ ఆసియాలోనే కీలకమైన ఎయిర్‌క్రాఫ్ట్స్ మెయింటెనెన్స్, రిపేర్లు&ఓవర్‌హాలింగ్ (MRO) సెంటర్‌గా అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అమెరికా, చైనా తర్వాత ఏవియేషన్ మార్కెట్లో భారత్ 3వ స్థానంలో ఉందన్నారు. భారత ఏవియేషన్ రంగానికి భోగాపురం కీలక కేంద్రంగా మారనుందని, ఏవియేషన్ ఎడ్యుసిటీకి ఆనుకుని 500 ఎకరాలను MRO కార్యకలాపాల కోసం కేటాయించినట్లు ఆయన చెప్పారు.