News January 13, 2026
నేటి నుంచి జిల్లావ్యాప్తంగా ‘అరైవ్ అలైవ్’: కామారెడ్డి ఎస్పీ

రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నేటి నుంచి ప్రారంభమయ్యే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లాలో విజయవంతం చేయాలని SP రాజేష్ చంద్ర అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూనే, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా భద్రత, సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
Similar News
News February 18, 2026
వరి పంటలో ఎలుకల నిర్మూలనకు అనుకూల సమయం ఏది?

వరిలో నాట్లు వేసిన తర్వాత ఎలుకల నిర్మూలన చేపట్టడం సులభమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ సమయంలో బుట్టలను పెడితే ఎలుకలను సులభంగా నిర్మూలించవచ్చంటున్నారు. పంట చిరుపొట్ట దశలో ఎలుకల నిర్మూలన కష్టంగా మారుతుందని, ఈ సమయంలో బుట్టలతో వాటిని అరికట్టలేమని చెబుతున్నారు. చిరు పొట్ట దశలో ఎలుక కన్నాలను గుర్తిస్తే, పొగ బెట్టడం ద్వారా వాటిని కంట్రోల్ చేయొచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News February 18, 2026
ఎల్.ఎన్.పేట: ‘నదీతీరాన ఆకట్టుకున్న ఈశ్వరుడి సైకత శిల్పాలు’

ఎల్.ఎన్.పేట గ్రామానికి చెందిన సైకత శిల్పి తరణి ప్రసాద్ మిశ్రా వంశధార నదీ తీరంలో రూపొందించిన సైకత శిల్పాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బుధవారం చక్ర తీర్థ స్నానాలు సందర్భంగా శివుడు, శివలింగం కళాకృతులను తరణి ప్రసాద్ మిశ్రా నిర్మించారు. వీటికి భక్తులు పసుపు,కుంకుమలో పూజలు చేశారు.
News February 18, 2026
స్నాక్స్ లాగించేస్తున్నారా?

దాదాపు 76% మంది భారతీయులకు రోజుకు రెండుసార్లైనా స్నాక్స్ తినే అలవాటు ఉంది. బిస్కెట్స్, చిప్స్, షుగరీ ఫుడ్స్, డ్రింక్స్ వంటివి తీసుకోవడం వల్ల జీవక్రియపై ఒత్తిడి పడుతుంది. డయాబెటిస్ రిస్క్ పెరిగి, ఆయుష్షుపైన ప్రభావం పడుతుంది. భారతీయుల జీవనశైలికి ప్రొటీన్, ఫైబర్, సరిపడా కార్బ్స్ ఉండే బ్యాలెన్స్డ్ మీల్స్ రోజులో 2-3 సార్లు తీసుకుంటే సరిపోతుందని.. స్నాక్స్ అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.


