News March 21, 2025

నేటి నుంచి పది పరీక్షలు..36 కేంద్రాలు

image

ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షల కోసం మొత్తం 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 21 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 6,421 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు బాలురు 2,894, బాలికలు 3,527, మొత్తం 6,421మంది ఉన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్163 సెక్షన్ అమలు చేయనున్నట్లు చెప్పారు.

Similar News

News October 28, 2025

‘మీ ఫోన్ ఏమైంది?’ జనార్దనరావుకు సిట్ ప్రశ్నలు

image

AP: నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు జనార్దనరావును అతని ఫోన్ గురించి అడిగినట్లు తెలుస్తోంది. ‘SA వెళ్లాక మీ ఫోన్ ఏమైంది? ఆధారాలు బయట పడతాయని ధ్వంసం చేశారా? ములకలచెరువులో నకిలీ మద్యం యూనిట్ వెలుగుచూశాకే మీ ఫోన్ పోయిందా?’ అని ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. తన ఫోన్ చోరీకి గురైందని, ఎలా పోయిందో తెలియలేదని జనార్దనరావు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఆధారాలున్నాయా? అని అడగ్గా మౌనంగా ఉండిపోయారు.

News October 28, 2025

145 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్‌లో 145 కాంట్రాక్ట్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ICAI/ICOAI/ICSIలో ఇంటర్మీడియట్/ ఎగ్జిక్యూటివ్‌ లెవల్‌లో ఉత్తీర్ణులైన CA/CS/CMS అభ్యర్థులు అర్హులు. వయసు 35ఏళ్ల లోపు ఉండాలి. వెబ్‌సైట్: https://www.mca.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News October 28, 2025

మూడసర్లోవ రిజర్వాయర్‌కు జలకళ

image

మొంథా తుపాను నేపథ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని ప్రధాన జలాశయం ముడసర్లోవ జలకళను సంతరించుకుంది. ఈ జలాశయం సామర్థ్యం 170 అడుగులు కాగా.. మంగళవారం ఉదయం నాటికి 163 అడుగులకు నీరు చేరుకుంది. ఆదివారం 157 అడుగుల వరకు నీరు ఉండేది. సామర్థ్యానికి మించి ఇన్ఫ్లో ఉంటే నీరు విడిచి పెట్టే అవకాశం ఉంది.