News June 24, 2024
నేటి నుంచి పాఠశాలల్లో విద్యా ప్రవేశం: డీఈవో

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం నుంచి నాలుగు వారాల పాటు విద్యాప్రవేశం కార్యక్రమం అమలు జరుగుతుందని డీఈవో డి.సుభద్ర పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర సమగ్రశిక్ష సంస్థ ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు నూరుశాతం విద్యార్థుల నమోదు చేయించాలన్నారు. పర్యవేక్షణ కోసం దీక్ష యాప్ను వినియోగించుకోవాలన్నారు
Similar News
News December 5, 2025
కొనకనమిట్ల : ఐదు సెకండ్ల పాటు కంపించిన భూమి!

కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాల్లో భూకంపం వచ్చినట్లు పలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3: 30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలిపారు. ఇళ్లలోని వస్తువులు సైతం కదిలినట్లు చెప్తున్నారు. ఆ సమయంలో నిద్రలో నుంచి లేచి భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నారు.
News December 5, 2025
MRKP: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 13న మార్కాపురం కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహంచనున్నారు. 6 మండలాల పోలీసులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బాలాజీ గురువారం సమీక్షించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా క్రిమినల్, సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, రాజీమార్గం ద్వారా పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు జాతీయలోక్ అదాలత్ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
News December 5, 2025
MRKP: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 13న మార్కాపురం కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహంచనున్నారు. 6 మండలాల పోలీసులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బాలాజీ గురువారం సమీక్షించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా క్రిమినల్, సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, రాజీమార్గం ద్వారా పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు జాతీయలోక్ అదాలత్ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.


