News April 10, 2025

నేటి నుంచి పాలిసెట్ శిక్షణ తరగతులు ప్రారంభం

image

పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఉచితంగా పాలిసెట్ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఇల్లందు సింగరేణి కాలరీస్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో నేటి నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణను స్థానిక విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News November 23, 2025

నెల్లూరు నగర మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి గ్రీన్ సిగ్నల్!

image

నెల్లూరు నగర మేయర్ స్రవంతి‌పై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంపై మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లతో చర్చించారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న నిర్ణయంపై ఇరువురు నేతల అంగీకారం తెలిపారు. సోమవారం కార్పొరేటర్లందరూ కలెక్టర్‌ను కలిసి నోటీసు ఇవ్వనున్నారు.

News November 23, 2025

ఊట్కూర్: తెలంగాణ ఉద్యమ నాయకుడి మృతి

image

ఊట్కూర్ మండలంలోని పెద్దపోర్ల గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత మాలే బాలప్ప (48) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. వారం క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌తో శస్త్రచికిత్స జరిగింది. అస్వస్థత గురై పరిస్థితి విషపించడంతో తుదిశ్వాస విడిచారు. 2001 మలిదశ ఉద్యమంలో రైలు రోకో, రాస్తారోకో, సకలజనుల సమ్మె వంటి కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. పలువురు సంతాపం తెలిపారు.

News November 23, 2025

సీమ అభివృద్ధికి సత్య సాయిబాబా కృషి: కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. వేడుకల్లో కర్నూలు ఎంపీ నాగరాజు, కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సత్య సాయిబాబా రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు.