News July 8, 2024

నేటి నుంచి పిన్నెల్లి విచారణ

image

మాచర్ల YCP మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సోమవారం నుంచి పోలీసులు విచారించనున్నారు. పోలింగ్ రోజు పాల్వాయిగేట్‌లో ఈవీఎం ధ్వంసం, TDP ఏజెంట్‌ శేషగిరిరావుపై దాడి, కారంపూడిలో అల్లర్లు, సీఐ నారాయణస్వామిపై దాడికి సంబంధించి ఆయన్ను విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ, రేపు (8, 9 తేదీల్లో) నెల్లూరు జైలులోనే ఆయన విచారణ జరగనుంది. విచారించేటప్పుడు వీడియో తీయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

Similar News

News November 11, 2025

అయ్యో పాపం.. ఆస్పత్రి ఆవరణలో అనాధగా పడి ఉన్న వృద్ధుడు

image

తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఓ వృద్ధుడు అనాధగా దీన స్థితిలో పడి ఉన్నాడు. ఎక్కడ నుంచి వచ్చాడో తెలీదు కానీ ఆస్పత్రి ప్రాంగణంలో ఆరు బయట నీరసించి పడి ఉండటం చూపురులను కలచివేస్తోంది. అనారోగ్యంతో బక్కచిక్కి ఉన్న ఆయన పరిస్థితి చూసి అటుగా వెళుతున్న వారు అయ్యో పాపం అంటున్నారే తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు. వృద్ధుడికి యూరిన్ పైప్ అమర్చి ఉందని, మాట్లాడే స్థితిలో కూడా లేడని స్థానికులు చెబుతున్నారు.

News November 11, 2025

కృష్ణా నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

తాడేపల్లి పరిధి సీతానగరంలోని కృష్ణానదిలో మంగళవారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ ఖాజావలి తెలిపారు. మృతుని వయస్సు సుమారు 30నుండి 34 ఏళ్ల మద్యలో ఉంటుందని మృతుడు నలుపు రంగు ఫ్యాంటు, నీలం రంగు చొక్కా ధరించినట్లు చెప్పారు. మృతుని వివరాలు తెలిస్తే 86888 31364 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

News November 11, 2025

ఢిల్లీ పేలుళ్లు.. గుంటూరు పోలీసుల అప్రమత్తం

image

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో గుంటూరు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత కోసం రైల్వేస్టేషన్, బస్టాండ్, వాణిజ్య సముదాయాలు, జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు సంచారం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.