News June 3, 2024

నేటి నుంచి మద్యం విక్రయాలు బంద్: కలెక్టర్

image

 పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు డ్రైడేగా ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. 5వ తేదీ వరకు మద్యం విక్రయాలు నిర్వహించరాదని, నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కడైనా మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News December 8, 2025

టెట్‌ అభ్యర్థులకు 10 నుంచి పరీక్షలు

image

టెట్‌‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ వాసుదేవరావు తెలిపారు. రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.

News December 8, 2025

బొమ్మూరు: స్టార్టప్‌ ఐడియా ఉందా? రండి.. ‘స్పార్క్‌’ చూపిద్దాం!

image

నూతన ఆవిష్కరణలు, వినూత్న వ్యాపార ఆలోచనలు ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 9 నుంచి 11 వరకు ‘స్పార్క్‌’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జేసీ వై. మేఘ స్వరూప్‌తో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో జరిగే శిక్షణలో నిపుణులు దిశానిర్దేశం చేస్తారన్నారు. నోడల్ ఆఫీసర్ సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.

News December 8, 2025

ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించండి: తూ.గో. ఎస్పీ

image

తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు 32 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ బాధితుల నుంచి స్వయంగా వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి.. బాధితుల ఫిర్యాదులను చట్టపరిధిలో విచారించి, సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు. PGRS అర్జీల పరిష్కారంలో జాప్యం వహించరాదని ఆయన స్పష్టం చేశారు.