News February 5, 2025
నేటి నుంచి మేడారంలో తొలి ఘట్టం!

తాడ్వాయి మండలం మేడారంలో నేటి (బుధవారం) నుంచి సమ్మక్క-సారలమ్మ మినీ జాతర పూజలు ప్రారంభం కానున్నాయి. కన్నెపల్లిలోని సారలమ్మ, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో పూజారులు శుద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆలయాల్లోని పూజ సామగ్రిని శుద్ధిచేసి నైవేద్యాలు సమర్పించి మినీ జాతర విజయవంతం కావాలని అమ్మవార్లను మొక్కుకుంటారు. కాగా ఈనెల 12 నుంచి మినీ జాతర ప్రారంభం కానుంది.
Similar News
News January 19, 2026
రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు దావోస్ పర్యటన కీలకం: ఎంపీ సానా

CM చంద్రబాబు దావోస్ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి కీలకమని MP సానా సతీష్ బాబు అన్నారు. సోమవారం ఢిల్లీలో CMని కలిసి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాత్రింబగళ్లు రాష్ట్రం కోసం శ్రమిస్తున్న చంద్రబాబు కృషిని ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారని కొనియాడారు. ఈ పర్యటన విజయవంతమై రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిలో ఈ పర్యటన మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
News January 19, 2026
మన్యంకొండ ఆలయ హుండీ ఆదాయం రూ.35.77 లక్షలు

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.35,77,912 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, గ్రంథాలయ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
News January 19, 2026
ఇండియన్ క్రికెట్లో ఏం తప్పు జరుగుతోంది: CV ఆనంద్

న్యూజిలాండ్ చేతిలో భారత్ చారిత్రక ఓటమిని ఎదుర్కోవడంపై IPS CV సివి ఆనంద్ చేసిన ఘాటు వ్యాఖ్యలు SMలో వైరల్గా మారాయి. ‘ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు, అపారమైన ప్రతిభ, ఏడాదంతా టోర్నీలు ఉన్నప్పటికీ.. మనం వరుసగా అన్నీ ఓడిపోతున్నాం. అసలు ఇండియన్ క్రికెట్లో తప్పెక్కడ జరుగుతోంది? IPL డబ్బు ప్రభావం, ఆటగాళ్లలో టెంపర్మెంట్ తగ్గడం, పూర్ సెలక్షన్, కోచ్ గంభీరే దీనికి కారణమా?’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.


