News December 7, 2024

నేటి నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత

image

శ్రీశైల క్షేత్రంలో వెలసిన మల్లికార్జున స్వామి స్పర్శదర్శనాన్ని శని, ఆది, సోమవారాల్లో తాత్కాలికంగా నిలిపివేసినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. శని, ఆది, సోమవారాల్లో క్షేత్రానికి భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో ఈ 3 రోజుల్లో ఉచిత స్పర్శదర్శన సేవలు నిలిపివేసినట్లు తెలిపారు. తిరిగి మంగళవారం నుంచి శుక్రవారం వరకు యథావిధిగా స్పర్శ దర్శనం సేవలు కొనసాగుతాయని వెల్లడించారు.

Similar News

News December 6, 2025

కర్నూలు జిల్లా రైతులకు శుభవార్త

image

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు ఈనెల 8న ప్రారంభం కానుందని మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు. మార్కెట్ యార్డు కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వడ్ల పంటను మార్కెట్ యార్డుకు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర(MSP)కు అనుగుణంగా పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతాయని అన్నారు.

News December 6, 2025

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి: ఐజీ ఆకే రవికృష్ణ

image

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఐజీ ఆకే రవికృష్ణ ఆకాంక్షించారు. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల జడ్పీ పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించారు. ఆకే రవికృష్ణ వర్చువల్‌లో పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. ప్రతీ విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకొని, ఆ లక్ష్యసాధన దిశగా ముందుకు వెళ్తే అనుకున్నది సాధించవచ్చన్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుకు సహకరించాలన్నారు.

News December 6, 2025

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి: ఐజీ ఆకే రవికృష్ణ

image

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఐజీ ఆకే రవికృష్ణ ఆకాంక్షించారు. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల జడ్పీ పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించారు. ఆకే రవికృష్ణ వర్చువల్‌లో పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. ప్రతీ విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకొని, ఆ లక్ష్యసాధన దిశగా ముందుకు వెళ్తే అనుకున్నది సాధించవచ్చన్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుకు సహకరించాలన్నారు.