News April 5, 2025
నేటి నుంచి సిరసనగండ్ల బ్రహ్మోత్సవాలు

నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిరసనగండ్ల శ్రీ సీతారామ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రెండో భద్రాద్రిగా పేరుపొందిన సిరసనగండ్ల బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాలకు దేవాలయాన్ని దేదీప్యమానంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వహణ అధికారులు వెల్లడించారు.
Similar News
News December 23, 2025
పూజల్లో ‘వక్క’ సమర్పిస్తున్నారా?

‘వక్క’ అత్యంత పవిత్రమైనది. పూజలో దీనిని అఖండంగా(ముక్కలు చేయకుండా) ఉపయోగించాలని పండితులు చెబుతున్నారు. తద్వారా పూర్తి ఫలితం లభిస్తుందంటున్నారు. ‘దీన్ని దేవతలకు ప్రతీకగా భావిస్తారు. ఇది దైవంతో మనకున్న బలమైన బంధానికి, విధేయతకు చిహ్నం. ఆయుర్వేద పరంగానూ ఇది చాలా ఉపయోగకరం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలి పెంచుతుంది. యజ్ఞాల్లో తమలపాకుతో కలిపి వక్క సమర్పిస్తే కార్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.
News December 23, 2025
మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయాలి: కలెక్టర్

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్న భోజనం అమలుకు సంబంధించి జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ రాజాబాబు అధ్యక్షత నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకం నూరు శాతం అమలుజరగడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుందని, నాణ్యత లోపాలు లేకుండా చూడాలన్నారు.
News December 23, 2025
బాపట్ల జిల్లాలో సౌర విద్యుత్ ఉత్పత్తికి భారీ పరిశ్రమ ఏర్పాటు

సౌర విద్యుత్ ఉత్పత్తి భారీ పరిశ్రమ ఏర్పాటుకు బల్లికురవ, సంతమాగులూరు మండలాలలో 1,591.17 ఎకరాల భూమికి సహకరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం అన్నారు. ఈ పరిశ్రమకు కేటాయించే భూసేకరణకు నిధులు విడుదలయ్యాయన్నారు. వేగంగా భూసేకరణ చేపట్టి, ల్యాండ్ బ్యాంకు సిద్ధం చేయాలన్నారు. 2 వారాలలో సమగ్ర నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూమి ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.


