News January 10, 2025
నేటి నుంచి సెలవులు: కడప డీఈవో

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇవాళ్టి నుంచి కడప జిల్లాలో సంక్రాంతి సెలవులు ఇస్తున్నామని డీఈవో మీనాక్షి వెల్లడించారు. జనవరి 19 వరకు సెలవులు ఉంటాయని చెప్పారు. 20న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయన్నారు. మైనారిటీ విద్యాసంస్థలకు జనవరి 11 నుంచి 15 వరకు ఉంటాయని స్పష్టం చేశారు. సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని DEO హెచ్చరించారు.
Similar News
News November 19, 2025
జమ్మలమడుగు వైసీపీ ఇన్ఛార్జ్గా రామసుబ్బారెడ్డి

జమ్మలమడుగు YCP ఇన్ఛార్జ్ విషయంలో పార్టీ అధిష్ఠానం కీలక ప్రకటన చేసింది. MLC రామసుబ్బారెడ్డికే ఇన్ఛార్జ్ పదవి బాధ్యతలు ఇస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు మాజీ MLA సుధీర్ రెడ్డికి 3 మండలాలు, రామసుబ్బారెడ్డికి 3 మండలాలు అప్పగించింది. జగన్ సమక్షంలో జరిగిన ఈ పంచాయితీలో రామసుబ్బారెడ్డికే ఖరారు చేసింది. సుధీర్ రెడ్డికి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పదవి ఇచ్చింది.
News November 19, 2025
జమ్మలమడుగు వైసీపీ ఇన్ఛార్జ్గా రామసుబ్బారెడ్డి

జమ్మలమడుగు YCP ఇన్ఛార్జ్ విషయంలో పార్టీ అధిష్ఠానం కీలక ప్రకటన చేసింది. MLC రామసుబ్బారెడ్డికే ఇన్ఛార్జ్ పదవి బాధ్యతలు ఇస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు మాజీ MLA సుధీర్ రెడ్డికి 3 మండలాలు, రామసుబ్బారెడ్డికి 3 మండలాలు అప్పగించింది. జగన్ సమక్షంలో జరిగిన ఈ పంచాయితీలో రామసుబ్బారెడ్డికే ఖరారు చేసింది. సుధీర్ రెడ్డికి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పదవి ఇచ్చింది.
News November 19, 2025
సింహాద్రిపురం: అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

సింహాద్రిపురం మండలంలోని బిందెనంచెర్ల చెందిన ముత్తులూరు పెద్దిరెడ్డి(47) అనే చీని అన్నదాత మంగళవారం చెరువుకట్ట వద్దకు వెళ్లి విష ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ రైతుకు ఐదు ఎకరాల చీనీ తోట ఉంది. పంట సాగుకు, కుటుంబ అవసరాలకు రూ.20 లక్షలు అప్పులు చేశాడు. చీనీ కాయలకు ధరలు లేకపోవడంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


