News January 13, 2025

నేటి నుంచి SU పరిధిలోని కళాశాలలకు సెలవులు 

image

సంక్రాంతి పండగ నేపథ్యంలో.. కరీంనగర్ పట్టణంలోని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలకు సెలవులు ప్రకటించారు. యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ, బీఈడీ, ఫార్మసీ, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు నేటి నుంచి ఈ నెల 15 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తిరిగి 16 నుంచి తరగతులకు హాజరు కావాలన్నారు.

Similar News

News October 30, 2025

శంకరపట్నం: తల్లికొడుకులపై గొడ్డలితో దాడి.. హత్యాయత్నం

image

శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామంలో తల్లికొడుకులపై గొడ్డలితో దాడి జరిగింది. గ్రామానికి చెందిన గడ్డం రాజు, గడ్డం మల్లవ్వపై చొప్పదండి మండలం మంగళపల్లికి చెందిన వారి బంధువులు హత్యా ప్రయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు. పాత కక్షల కారణంగా ఈ దాడి జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వీరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 30, 2025

KNR: మొంథా తుఫాన్.. రైతన్నలకు మిగిల్చింది తడిసిన ధాన్యమే

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. అధికారుల అంచనా ప్రకారం 2036 మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలో తడిసి ముద్దయినట్లు సమాచారం. చేతికి వచ్చిన పంట అమ్ముకునే సమయంలో వర్షాలు పడి పంట నష్టాన్ని కలిగించిందన రైతులు వాపోయారు. రైతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించే సాయమే మిగిలిందని రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు.

News October 29, 2025

KNRలో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సెలవు ప్రకటిస్తూ విద్యాధికారులకు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అందుబాటులో ఉండాలని సూచించారు.