News February 25, 2025
నేటి మంచిర్యాల జిల్లా టాప్ న్యూస్

◼️రైలు కిందపడి కాసిపేట యువకుడి సూసైడ్
◼️ భీమినిలో రోడ్డుప్రమాదం.. యువకుడి మృతి
◼️MLC ఎన్నికల్లో BJP, BRS కుమ్మక్కయ్యాయి: సీతక్క
◼️మంచిర్యాల: నీలగిరి ప్లాంటేషన్లో పెద్దపులి సంచారం
◼️వేలాలలోని కిరాణా షాపులకు నోటీసులు
◼️బుగ్గ జాతరకు ప్రతి 10నిమిషాలకు ఒక బస్సు
Similar News
News October 27, 2025
BC ఓటు బ్యాంకుపైనే RJD గురి

బిహార్ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. ప్రధాన పోటీ NDA, MGBల మధ్యే ఉంది. మహాఘట్బంధన్లో కీలకమైన RJD BC ఓట్లపై గురిపెట్టింది. పోటీచేస్తున్న143 స్థానాల్లో 51% సీట్లు BCలకు కేటాయించింది. ఇందులో 53సీట్లు యాదవులవే. EBCలకు 11% ముస్లింలకు 13% అగ్రవర్ణాలకు 10% సీట్లు ఇచ్చింది. గత ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండడంతో ఈబీసీల సంఖ్య ఈసారి తగ్గించి బీసీలకు ప్రాధాన్యమిచ్చింది.
News October 27, 2025
MBNR: పటేల్ జయంతి అధికారికంగా నిర్వహిస్తాం: డీకే అరుణ

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. మహబూబ్నగర్ క్యాంపు ఆఫీస్లో ‘యూనిటీ మార్చ్’ పోస్టర్ను విడుదల చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఏక్ భారత్-ఆత్మనిర్బర్ భారత్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దేశ సమైక్యత కోసం పోరాడిన పటేల్ ఆశయ సాధనే అందరి లక్ష్యమని అరుణ అన్నారు.
News October 27, 2025
HYD: చిన్న శ్రీశైలం సహా 99 మంది బైండోవర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్తో కలిపి 100 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. నవీన్ యాదవ్ ర్యాలీలో రౌడీ షీటర్లు పాల్గొన్నారన్న ఆరోపణలతో EC ఆదేశాల మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. బోరబండలో 74 మంది, మధురానగర్లో చిన్న శ్రీశైలం సోదరుడితో పాటు 19 మంది బైండోవర్ అయ్యారు. ఎన్నికల వేళ నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.


