News March 10, 2025

నేడు అనంత కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. నేటి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరవుతారన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News March 23, 2025

గుత్తిలో కేజీ చికెన్ రూ.170

image

అనంతపురం జిల్లా గుత్తిలో కేజీ చికెన్ ధర రూ.170-180లుగా ఉంది. గుంతకల్లులో కిలో రూ.150-160 చొప్పున అమ్ముతున్నారు. ఇక అనంతపురంలో కేజీ రూ.140-150లతో విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు తెలిపారు. గత ఆదివారంతో పోల్చితే నేడు చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తి, గుంతకల్లులో కేజీ మటన్ ధర రూ.700-750లుగా ఉంది.

News March 23, 2025

JNTUలో బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశం.. సిలబస్‌లో మార్పులు

image

అనంతపురం జేఎన్టీయూ యూనివర్సిటీలోని వీసీ కాన్పరెన్స్ హాల్‌లో శనివారం బోర్డు ఆఫ్ స్టడీస్ (BOS) సమావేశాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించి వీసీ హెచ్.సుదర్శన రావు మాట్లాడుతూ.. యూనివర్సిటీ పరిధిలోని బీటెక్ 3, 4 సంవత్సరాలకు R23 సిలబస్‌లో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీసీతో పాటు రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్లు భానుమూర్తి, సత్యనారాయణ, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

News March 22, 2025

ఫారంపాండ్‌తో రైతులకు ఎంతో ప్రయోజనం: కలెక్టర్

image

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కూడేరు మండలం చోళ సముద్రంలో రైతు ఎర్రస్వామి పొలంలో ఫారంపాండ్ ఏర్పాటుకు సంబంధించి భూమిపూజ పనులను శనివారం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఫారంపాండ్ పనులకు భూమిపూజ చేశామన్నారు. ఫారంపాండ్‌తో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.

error: Content is protected !!