News March 22, 2025
నేడు అన్నమయ్య జిల్లాలో వర్షం

అన్నమయ్య జిల్లాలో ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జిల్లా ఉక్కపోతతో అల్లాడుతోంది. ప్రజలకు ఉపశమనం కలిగేలా నేడు అన్నమయ్య జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉపరితల ద్రోణి, బంగాళాఖాతంలో అధికపీడనం ప్రభావంతో నేడు వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే ఆది, సోమవారాల్లో కూడా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Similar News
News October 14, 2025
NOV. 17 నుంచి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 11వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16వ తేదీన అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా 17వతేది ఉదయం ధ్వజారోహణం, 21న గజవాహనం, 22న గరుడ వాహనం, 24న రథోత్సవం, 25న పంచమీతీర్థం జరగనుంది.
News October 14, 2025
విశాఖలో మొట్టమొదటి గూగుల్ AI హబ్: సుందర్

డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటన చేశారు. ‘విశాఖపట్నంలో తొలి ఏఐ హబ్కు సంబంధించిన ప్రణాళికపై ప్రధాని మోదీతో మాట్లాడా. ఈ ఏఐ హబ్ కీలక మైలురాయి కానుంది. ఈ కేంద్రంలో గిగావాట్ సామర్థ్యం ఉండే హైపర్ స్కేల్ డేటా సెంటర్, ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వే & భారీ స్థాయి ఇంధన మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. దీనిద్వారా AI ఆవిష్కరణలు వేగవంతం చేస్తాం.’ అని Xలో పేర్కొన్నారు.
News October 14, 2025
TU: అదుపు తప్పిన ఉపకులపతి కారు

టీయూ ఉపకులపతి ఆచార్య యాదగిరి రావు ప్రభుత్వ వాహనం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం ఉదయం ఉపకులపతి పరిపాలనా భవనం వద్దకు చేరుకొని, తన సొంత పనుల నిమిత్తం వాహనంలో ఆయన భార్యను నిజామాబాద్కి పంపించారు. తిరిగి వస్తుండగా కంఠేశ్వర్ బైపాస్ వద్ద అదుపు తప్పి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. గమనించిన స్థానికులు వాహనాన్ని రోడ్డుకు చేర్చారు.