News March 22, 2025
నేడు అన్నమయ్య జిల్లాలో వర్షం

అన్నమయ్య జిల్లాలో ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జిల్లా ఉక్కపోతతో అల్లాడుతోంది. ప్రజలకు ఉపశమనం కలిగేలా నేడు అన్నమయ్య జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉపరితల ద్రోణి, బంగాళాఖాతంలో అధికపీడనం ప్రభావంతో నేడు వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే ఆది, సోమవారాల్లో కూడా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Similar News
News November 5, 2025
కొలనుపాక సోమేశ్వరాలయాన్ని దర్శించుకున్న కలెక్టర్

ఆలేరు మండలంలోని కొలనుపాక ప్రాచీన దేవాలయమైన శ్రీ చండికాంబ సమేత సోమేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు దర్శించుకున్నారు. కార్తీకమాసం సందర్భంగా దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం తెలుపి, దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
News November 5, 2025
బాపట్లలో ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు

ప్రైవేటు బస్సులు నడిపేవారు రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బాపట్ల వాహన తనిఖీ అధికారి ప్రసన్నకుమారి చెప్పారు. బాపట్ల పట్టణంలో పట్టణ పోలీసులతో కలిసి ప్రైవేటు బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేసి ఎమర్జెన్సీ డోర్లను పరిశీలించారు. బస్సుల పత్రాలను పరిశీలించి డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. బస్సులలో ఫైర్ సేఫ్టీ సిలిండర్ అందుబాటులో ఉంచుకోవాలని పరిమితికి మించి వేగంగా ప్రయాణించవద్దని సూచించారు.
News November 5, 2025
అయిజ: ఇంటర్నేషనల్ రన్నింగ్లో నడిగడ్డ వాసి ఫస్ట్

ఇంటర్నేషనల్ రన్నింగ్లో గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ మొదటి స్థానంలో నిలిచాడు. 42 కిలోమీటర్ల ఇంటర్నేషనల్ రన్నింగ్ పోటీలు నేపాల్ రాష్ట్రంలో జరిగాయి. ఆ పోటీల్లో పాల్గొన్న హరికృష్ణ సునాయాసంగా 42 కిలోమీటర్లు రన్నింగ్ చేసి ఇంటర్నేషనల్ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. నడిగడ్డ వాసికి మొదటి స్థానం దక్కడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


