News January 22, 2025
నేడు ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మంత్రుల పర్యటన

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఇద్దరు మంత్రులు జిల్లాకు రానున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ రానున్నారు. రేణిగుంట, నారాయణపూర్, రుద్రంగి, జైన గ్రామాలలో జరిగే గ్రామసభలో పాల్గొంటారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Similar News
News October 15, 2025
ఆర్డీవో నివేదిక జాప్యంపై కరీంనగర్ కలెక్టర్కు ఫిర్యాదు

135 రోజుల తర్వాత కూడా తన ఫిర్యాదుపై తుది నివేదిక ఇవ్వకపోవడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. 2024 డిసెంబర్ 23న ప్రజావాణిలో ఫేక్ సర్టిఫికెట్తో జాబ్ చేస్తున్నాడని వీఆర్ఏపై ఫిర్యాదు చేసిన బాధితుడికి, కలెక్టర్ 2025 ఏప్రిల్ 25న హుజురాబాద్ ఆర్డిఓను 15రోజులలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆర్డీఓ మూడు సార్లు నోటీసులు జారీ చేసి, సెప్టెంబర్ 12న విచారణ పూర్తి చేసిన తుది నివేదిక అందించలేదని వాపోయాడు.
News October 15, 2025
KNR: నషాముక్త్ భారత్, కుశాల్ భారత్ కార్యక్రమం

స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రిన్సిపల్ డా.వరలక్ష్మి అధ్యక్షతన భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న నషాముక్త్ భారత్, కుశాల్ భారత్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రాం ఆఫీసర్లు డా.మొగిలి, డా.లక్ష్మణరావు, పెద్ది స్వరూప, డా.స్రవంతి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
News October 15, 2025
KNR: బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన సదస్సు

స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కరీంనగర్ హెల్త్ క్లబ్, రెడ్డీస్ లాబరేటరీ ఆధ్వర్యంలో, ప్రిన్సిపల్ డా.డి.వరలక్ష్మి అధ్యక్షతన, డాక్టర్ ఎం. ప్రతిష్ఠ రావు Reproduction concern Grenz, మహిళలలో వచ్చే Breast Cancer, PCDD పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ క్లబ్ కో ఆర్డినేటర్ డా. నజియా, జె.రజిత, డి.స్వరూప రాణి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.