News May 18, 2024
నేడు ఉమ్మడి ప.గో. జిల్లాలో ప్రవీణ్ ప్రకాష్ పర్యటన

రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ శనివారం ఉమ్మడి ప.గో. జిల్లాలో పర్యటించనున్నారు. ఏలూరు జిల్లాలోని భీమడోలు, ఉంగుటూరు మండలాల్లో, ప.గో.జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకులో వివిధ పాఠశాలలను సందర్శించనున్నారు. పాఠ్యపుస్తకాల వివరాలను స్టాక్ పాయింట్లను పరిశీలిస్తారు. గత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు పంపిణీ చేయగా మిగిలిన పాఠ్యపుస్తకాల వివరాలను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.
Similar News
News December 4, 2025
ప.గో: ఈ నెల 14 వరకే ఛాన్స్

పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ(పీఎంఏవైజీ) పథకం ప్రారంభించింది. వీటి దరఖాస్తుల గడువు ఇటీవల ముగియగా..లబ్ధిదారుల దృష్ట్యా ఈ నెల 14వరకు పొడిగించింది. గతంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వారి వివరాలను ఆన్లైన్లో తొలగించి..కొత్తగా అవకాశం కల్పించనుంది. ఇంటి ఏర్పాటుకు రూ.2.50 లక్షల రాయితీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వనున్నాయి.
News December 4, 2025
పాలకొల్లు: మహిళ హత్య కేసులో..నిందితుడు అరెస్టు

పాలకొల్లులో ఓ మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు..పాలకొల్లు టిడ్కో ఇంటిని అద్దె తీసుకుని రాధ అనే మహిళతో సుధాకర్ అనే వ్యక్తి ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. మద్యం మత్తులో రాధతో గొడవ పడి టిట్కో భవనం మేడపైకి తీసుకెళ్లి..తోసేసినట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. కుమారై భవ్యశ్రీ ఫిర్యాదుతో సుధాకర్ను అరెస్టు చేశామని ఎస్సై పృథ్వీ తెలిపారు.
News December 3, 2025
పెనుమంట్రలో ధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్

జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామని రైతులు RSKలను ధాన్యం అమ్మకాలకు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం పెనుమంట్ర మండలం వెలగలేరు గ్రామ పంచాయతీ పరిధిలోని మార్టేరు బ్రాహ్మణచెరువు ప్రధాన రహదారిపై నిల్వ చేసిన ధాన్యం రాశులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. అనంతరం కొద్దిసమయం రైతులతో మాట్లాడారు.


