News February 26, 2025
నేడు ఓర్వకల్లుకు ప్రముఖ లేడీ సింగర్ రాక

ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని శ్రీ భ్రమరాంబ సమేత బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ సింగర్ మధుప్రియ, పల్సర్ బైక్ ఝాన్సీ, రమేశ్ బృందం సందడి చేయనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News November 13, 2025
ఆసిమ్ మునీర్కు విస్తృత అధికారాలు!

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ విస్తృత అధికారాలు పొందేందుకు రాజ్యాంగ సవరణకు ఆమోదముద్ర పడింది. ఇది అన్ని సైనిక శాఖలపై అతనికి అత్యున్నత అధికారాన్ని కల్పించడమే కాకుండా సుప్రీంకోర్టు అధికారాలను పరిమితం చేస్తుంది. కొత్త అధికారాలతో నియామకాలు, మధ్యంతర ప్రభుత్వాలపై నియంత్రణ కలిగి ఉండటమే కాకుండా చట్టపరమైన విచారణ నుంచి జీవితకాల రక్షణ పొందుతారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతలు, పలువురు జడ్జిలు ఖండించారు.
News November 13, 2025
WTCలో 12 జట్లు!

వచ్చే సీజన్ నుంచి WTC(వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్)లో 12 జట్లు ఆడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 9 జట్లు ఆడుతుండగా 2027-29 సీజన్కు 12కు పెంచే యోచనలో ICC ఉన్నట్లు సమాచారం. 2టైర్ సిస్టమ్ను రద్దు చేసి ఆఫ్గానిస్థాన్, జింబాబ్వే, ఐర్లాండ్ను జాబితాలో చేర్చనున్నట్లు ESPN కథనం తెలిపింది. దీంతో ప్రతి జట్టుకు టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొంది.
News November 13, 2025
పాలమూరు: నేడు.. U-14 ‘క్రికెట్’ ఎంపిక

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14 బాలురకు క్రికెట్ జట్ల ఎంపికలను MDCA స్టేడియంలో(సత్యం కాలనీ పిల్లలమర్రి రోడ్) నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. క్రీడాకారులు ఈ నెల 13న ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్, వైట్ డ్రెస్ కోడ్, పూర్తి కిట్టుతో హాజరు కావాలన్నారు. క్రీడాకారులు మహబూబ్ నగర్ పీడీ అబ్దుల్లాకు రిపోర్ట్ చేయాలన్నారు.
SHARE IT


