News February 26, 2025

నేడు ఓర్వకల్లుకు ప్రముఖ లేడీ సింగర్ రాక

image

ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని శ్రీ భ్రమరాంబ సమేత బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ సింగర్ మధుప్రియ, పల్సర్ బైక్ ఝాన్సీ, రమేశ్ బృందం సందడి చేయనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Similar News

News November 21, 2025

జాతీయ అథ్లెటిక్ పోటీలకు ‘పుల్లేటికుర్రు’ విద్యార్థిని

image

జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలకు అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు జడ్పీహెచ్ స్కూల్ 9వ తరగతి విద్యార్థిని చీకురుమిల్లి హర్షవర్ధని ఎంపికైనట్లు ఇన్‌ఛార్జ్ HM ధర్మరాజు శుక్రవారం తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-19 రన్నింగ్ పోటీలు జరిగాయన్నారు. ఈ పోటీల్లో హర్షవర్ధని 1500 మీటర్ల రన్నింగ్‌లో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందని చెప్పారు.

News November 21, 2025

‘అరటి సాగుచేస్తున్న రైతులను ఆదుకోండి’

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా అరటి సాగుచేస్తున్న రైతులను వెంటనే ఆదుకోవాలని CPM నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలో శుక్రవారం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నల్లప్ప, తదితర నాయకులు అరటి పంటలను పరిశీలించారు. గిట్టుబాటు ధర లేక అరటి సాగుచేస్తున్న రైతులు నష్టపోతున్నారని, వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

News November 21, 2025

TU: 5861 విద్యార్థుల హాజరు.. నలుగురు డిబార్

image

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో నిజామాబాద్ లో ముగ్గురు, కామారెడ్డిలో ఒకరు డిబారయ్యారని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. 30 పరీక్ష కేంద్రాలలో 6131 మంది విద్యార్థులకు గాను 5861 మంది విద్యార్థులు హాజరు కాగా 266 మంది గైర్హాజరయ్యారు. COE సంపత్ తో కలిసి బోధన్, ఆర్మూర్, ధర్పల్లి, కామారెడ్డి పరీక్షా కేంద్రాలను ఆయన పర్యవేక్షించారు.