News February 24, 2025

నేడు కరీంనగర్‌కు సీఎం

image

ఉమ్మడి KNR, MDK, NZB, ADB పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్‌కు రానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి నిజామాబాద్, మంచిర్యాలలో ప్రచారం ముగించుకుని సాయంత్రం 4 గంటల వరకు కరీంనగర్‌ చేరుకుంటారు. SRR కళాశాల మైదానంలో జరిగే పట్టభద్రుల సమావేశానికి హాజరవుతారు.

Similar News

News November 26, 2025

ఎఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని (కోడ్) అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎస్పీ సునీతతో కలిసి ఆయన నోడల్ అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి, నామినేషన్ల ప్రక్రియపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలన్నారు.

News November 26, 2025

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా అంబేడ్కర్ స్మృతి వనం: జడ శ్రవణ్

image

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ విజయవాడలోని అంబేడ్కర్ స్మృతి వనాన్ని సందర్శించి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా స్మృతి వనం అధ్వానంగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆయన మండిపడ్డారు. విగ్రహం ధ్వంసం అయ్యేలా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.స్మృతి వనం పరిరక్షణకు, సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

News November 26, 2025

ఘోర ప్రమాదం.. ఇద్దరు సిక్కోలు వాసుల మృతి

image

తమిళనాడు రామేశ్వరం సమీపంలో లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలాస(M) పెదంచల, వీర రామచంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు మృతిచెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయ్యప్పమాల ధరించి పలువురు శబరిమలై, రామేశ్వరం వెళ్లి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ఇల్లాకుల నవీన్(24), పైడి సాయి(26)గా పోలీసులు గుర్తించారు. గుంట రాజు, పైడి తారకేశ్వరరావు, పైడి గణపతి, తమ్మినేని గణేశం గాయపడ్డారు.