News April 3, 2025
నేడు కర్నూలుకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు కర్నూలుకు రానున్నారు. ఉ.9.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.30 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. అనంతరం నగర శివారులోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ నేత కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొంటారు. వధూవరులను ఆశీర్వదించిన తర్వాత జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. మ.12.50 గంటలకు తాడేపల్లికి తిరుగుపయనం అవుతారు.
Similar News
News October 12, 2025
బతుకు బండి.. పొంచి ఉన్న ప్రమాదం

ఆస్పరి, దేవనకొండ మండలాల్లో పత్తి సీజన్ ప్రారంభమైంది. పత్తి తీయడానికి రోజూ వందలాది మంది ట్రాక్టర్లు, ఆటోలలో కిక్కిరిసిపోయి ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, ఓవర్ లోడింగ్ కారణంగా ఈ ప్రయాణం యమపాశంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రమాదం సంభవిస్తుందోనన్న భయం కూలీలను వెంటాడుతోంది. పోలీసుల నిర్లక్ష్యం, నియంత్రణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని గ్రామస్థులు విమర్శిస్తున్నారు.
News October 12, 2025
బిట్కాయిన్, క్రిప్టో మోసాలపై జాగ్రత్త: ఎస్పీ

బిట్కాయిన్, క్రిప్టో మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బిట్కాయిన్ పెట్టుబడుల పేరుతో మోసాలు జరుగుతున్నాయన్నారు. మీకు లింకులు పంపితే, వాటిని తెరవవద్దు అన్నారు. సైబర్ మోసం జరిగినట్లయితే వెంటనే 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్లైన్) లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.
News October 11, 2025
చేపల వినియోగం పెంపునకు ప్రాధాన్యం: మంత్రి టీజీ భరత్

చేపల వినియోగం పెంచేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. శనివారం నన్నూరు టోల్గేట్ వద్ద పాణ్యం ఎమ్మెల్యే చరిత, కలెక్టర్ డా.ఏ.సిరితో కలిసి చేపల విలువ ఆధారిత యూనిట్ను ప్రారంభించారు. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యమని ఆయన చెప్పారు. రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో 60శాతం సబ్సిడీ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.


