News April 3, 2025
నేడు కర్నూలుకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు కర్నూలుకు రానున్నారు. ఉ.9.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.30 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. అనంతరం నగర శివారులోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ నేత కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొంటారు. వధూవరులను ఆశీర్వదించిన తర్వాత జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. మ.12.50 గంటలకు తాడేపల్లికి తిరుగుపయనం అవుతారు.
Similar News
News October 8, 2025
నేటి నుంచి ఎస్జీఎఫ్ అండర్-19 క్రీడా పోటీలు

కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో నేటి నుంచి ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్-19 బాలబాలికల విభాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, 9న చెస్, క్యారమ్స్, బాస్కెట్బాల్, పవర్ లిఫ్టింగ్, బాల్ బ్యాడ్మింటన్, 10న బ్యాడ్మింటన్, బేస్ బాల్, సాఫ్ట్ బాల్, త్రో బాల్, 11న హ్యాండ్ బాల్, హాకీ, రోప్ స్కిప్పింగ్, రోల్ బాల్, 13న క్రికెట్, యోగా ఎంపిక పోటీలు ఉంటాయని ఎస్జీఎఫ్ కార్యదర్శి రాఘవేంద్ర మంగళవారం తెలిపారు.
News October 8, 2025
ప్రధాని పర్యటన నేపథ్యంలో సమన్వయంతో పని చేయాలి: ఎస్పీ

ఈనెల 16 ప్రధాని మోదీ శ్రీశైలం, కర్నూలులో పర్యటిస్తున్నందన ఎస్పీ విక్రాంత్ పాటిల్ భద్రత ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. నన్నూరులోని రాగ మయూరి వద్ద బహిరంగ సభ, పార్కింగ్ ప్రదేశాలు, రూట్ డైవర్షన్లు ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో చర్చించారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావు ఉండకూడదని పోలీస్ సిబ్బందిని ఆయన ఆదేశించారు. సమన్వయంతో పని చేయాలన్నారు.
News October 8, 2025
కర్నూలు నగరపాలక ఆరోగ్య శాఖ అధికారిగా విష్ణుమూర్తి

కర్నూలు నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో ఆరోగ్య శాఖ అధికారిగా పనిచేస్తున్న విష్ణుమూర్తిని నియమించారు. మంగళవారం ఆయన నగరపాలకలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. విష్ణుమూర్తికి పారిశుద్ధ్య విభాగం ఇన్స్పెక్టర్లు, సిబ్బంది అభినందనలు తెలిపారు.