News December 18, 2024
నేడు కలికిరి రెవెన్యూ సదస్సుకు అన్నమయ్య కలెక్టర్
కలికిరిలో జరగబోయే రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి బుధవారం హాజరు కానున్నారు. ఈనెల 6 నుంచి అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో భూ సమస్యలు లేకుండా చేసేందుకు, రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. కలికిరి మండలానికి సంబంధించిన ప్రజలు సమస్యలను తెలపాలన్నారు.
Similar News
News February 5, 2025
సింహాద్రిపురంలో పులి పిల్లలు?
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలోని బలపనూరు గ్రామంలో కలకలం రేగింది. మంగళవారం గ్రామంలో పులి పిల్లలు కనిపించాయని గ్రామస్థులు తెలిపారు. రెండు పులి పిల్లలు నెమళ్లను వేటాడుతూ కనిపించాయని గ్రామస్థుడు కిషోర్ అన్నారు. మరికొందరు కూడా పొదల్లో పులి పిల్లలు కనిపించాయని తెలిపారు. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
News February 5, 2025
కడపలో మహానాడు స్థలాన్ని పరిశీలించిన మంత్రి
మే లో కడప వేదికగా నిర్వహించే టీడీపీ మహానాడు ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి సవిత జిల్లా నాయకులతో కలిసి పరిశీలించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే చైతన్యతో పాటు పలువురు నాయకులతో కలిసి మహానాడు నిర్వహించే స్థలాన్ని పరిశీలించి ఎంతమంది వస్తారు వారికి తగ్గ ఏర్పాట్ల చేసేలా చూడాలని మంత్రి నాయకులకు సూచించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు వస్తారన్నారు.
News February 4, 2025
నేటి విద్యార్థులే రేపటి పౌరులు: మంత్రి సవిత
నేటి విద్యార్థులే రేపటి భవిభారత పౌరులని, విద్యతోపాటు క్రీడలలో కూడా రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్ఠలు తేవాలని జిల్లా ఇంఛార్జి మంత్రి సవిత అన్నారు. మంగళవారం స్థానిక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలులో 37వ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సవిత ముఖ్య అతిథిగా వచ్చి విద్యార్థుల నుద్దేశించి మాట్లాడారు.