News July 8, 2024

నేడు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ: ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అభిషేక్

image

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేడు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం1 వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. 

Similar News

News December 16, 2025

PGRSకు అన్ని శాఖల అధికారులు పాల్గొనాలి: కలెక్టర్

image

మండల స్థాయిలో నిర్వహించే PGRS కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆదేశించారు. ప్రతి మండలం, డివిజన్ కార్యాలయాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి హాజరయ్యేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. పీజిఆర్ఎస్ కార్యక్రమానికి అధికారులందరూ ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు.

News December 15, 2025

ATP: మృత్యువులోనూ వీడని మూడుముళ్ల బంధం

image

రాయదుర్గం మండలం పల్లేపల్లిలో తిప్పన్న (72), తిప్పమ్మ (68) దంపతులు ఒకేరోజు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఇటీవల తిప్పమ్మ అనారోగ్యంతో మంచాన పడింది. ఆ దిగులుతో తిప్పన్న సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. భర్త మరణం తట్టుకోలేక ఉదయమే ఆమె కూడా కన్ను మూసింది. ఒకే రోజు భార్యాభర్త మృతి చెందడంతో ‘మృత్యువులోనూ వీడని మూడుముళ్ల బంధం’ అని గ్రామస్థులు పేర్కొన్నారు.

News December 15, 2025

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: SP

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)కు వచ్చే ప్రతి పిటిషన్‌ను విచారించి తక్షణమే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ జగదీష్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 96 అర్జీలు స్వీకరించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా డీఎస్పీ ఎస్.మహబూబ్ బాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.