News March 17, 2025
నేడు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చేతన్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ప్రజలు సమస్యలపై అర్జీలు తెలుపవచ్చని పేర్కొన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
Similar News
News November 17, 2025
నరసరావుపేట: ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలపై అవగాహన

ఎయిర్ఫోర్స్లో ఉద్యోగాలపై స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఈ నెల 19న అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. 16 నుంచి 20 ఏళ్ల యువత ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్మీలో అగ్నివీర్ తరహాలో ఎయిర్ఫోర్స్లో అగ్నివీర్ వాయుగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఎక్కువ మంది యువత ఉపాధి పొందేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
News November 17, 2025
కుల్కచర్ల బాలుర పాఠశాలను తనిఖీ చేసిన డిఈఓ

కుల్కచర్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రేణుకాదేవి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
News November 17, 2025
AP న్యూస్ రౌండప్

*నిధుల దుర్వినియోగం కేసులో IPS అధికారి సంజయ్ బెయిల్ పిటిషన్ను మూడోసారి తిరస్కరించిన ACB కోర్టు
*నకిలీ మద్యం కేసులో చొక్కా సతీశ్ రిమాండ్ను NOV 25 వరకు పొడిగింపు
*మూడు బీసీ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం
*తన భార్య డిజిటల్ అరెస్టుకు గురయ్యారంటూ MLA పుట్టా సుధాకర్ యాదవ్ చేసిన ఫిర్యాదుపై ఏడుగురిని అరెస్టు చేసిన కడప సైబర్ క్రైమ్ పోలీసులు


