News April 5, 2024
నేడు కాంగ్రెస్లో చేరనున్న డా.కిల్లి కృపారాణి
టెక్కలికి చెందిన మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపారాణి శుక్రవారం కడప జిల్లా బద్వేల్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆమె కార్యాలయ వర్గాలు తెలిపాయి. బద్వేల్లో ఏపీపీసీసీ చీఫ్ YS.షర్మిల బస్సుయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో ఆమె సమక్షంలో కృపారాణి పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటికే కృపారాణి బద్వేల్ చేరుకున్నారు. ఈసారి టెక్కలి అసెంబ్లీ నుండి కృపారాణి పోటీ చేస్తారని సమాచారం.
Similar News
News January 19, 2025
ఇచ్ఛాపురం: రెండు బైక్లు ఢీ.. ఇద్దరు మృతి
ఇచ్ఛాపురం పట్టణంలోని సంతపేట వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం బోనసాల ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సంతపేట వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు బలంగా ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా, సోంపేట ప్రాంతానికి చెందిన మరో ముగ్గురు వ్యక్తులను గాయపడ్డారు. క్షతగాత్రులను ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News January 19, 2025
పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఉరివేసుకుని పేషంట్ మృతి
పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఉరివేసుకుని బెవర జోగినాయుడు అనే పేషంట్ ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. వీరఘట్టం మండలం తలవరం గ్రామానికి చెందిన ఈయన పాంక్రియాటైటిస్తో బాధపడతూ శనివారం ఆసుపత్రిలో చేరారు. ఏం జరిగిందో ఏమో గాని ఆదివారం మేల్ వార్డు బాత్రూంలో ఉరి వేసుకుని సూసైడ్కు పాల్పడ్డాడు. మృతునికి భార్య కళ్యాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News January 19, 2025
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం కొత్తకోట జంక్షన్ సమీపంలో అలికాం-బత్తిలి ప్రధాన రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హిరమండలం కొండరాగోలుకు చెందిన సన్నబోయిన చంద్రశేఖర్(25) అనే యువకుడు మృతి చెందినట్లు సరుబుజ్జిలి ఎస్సై బి.హైమావతి తెలిపారు. ఆమదాలవలసలోని స్నేహితుడిని కలిసేందుకు బైక్పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొని ఈ ప్రమాదం చోటుచేసుకుంది.