News February 8, 2025
నేడు కావలిలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పర్యటన

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ శనివారం కావలి పట్టణంలో పర్యటించనున్నారు. కలెక్టర్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు నెల్లూరు జిల్లా కలెక్టర్ కావలి సెల్ఫీ పాయింట్ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 3.00 గంటలకు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వెంగళరావునగర్లో ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ఇందిరమ్మ కాలనీలో సిసి రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు.
Similar News
News February 8, 2026
నెల్లూరు: శివరాత్రికి భక్తుల సందడి ఎక్కడంటే..?

మహాశివరాత్రి వచ్చిందంటే జిల్లాలోని శివభక్తులు పుణ్యక్షేత్రాల వైపు అడుగులు వేస్తారు. ముఖ్యంగా కృష్ణపట్నం సిద్ధేశ్వర స్వామి, సముద్ర తీరాన వెలసిన కాటేపల్లి శివాలయాలకు భక్తులు భారీగా తరలివెళ్తారు. ప్రకృతి ప్రేమికులు వెంకటాచలం అడవిలోని శివాలయంలో ఏకాంతంగా స్వామిని దర్శించుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇక మైపాడు తీరాన సముద్ర స్నానాలు ఆచరించి శివయ్యను దర్శించుకోవడం ఇక్కడి భక్తుల ఆనవాయితీ.
News February 8, 2026
నెల్లూరు: మురుగుతున్న MP LADS

నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న ఎంపీలైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావులకు భారత ప్రభుత్వం MP LADS ను కేటాయిస్తుంది. వేమిరెడ్డికి రూ. 9.80 కోట్లను కేటాయించగా.. రూ. 5.06 కోట్ల నిధులు మిగిలి ఉన్నాయని సమాచారం. బీద మస్తాన్ రావుకు రూ.12.22 కోట్లు ఇవ్వగా రూ.3.37 కోట్లకు పనులు చేపట్టారు. కనీసం కొన్ని పనులు కూడా మొదలెట్టలేదంటే ఎలా ఖర్చు చేస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
News February 7, 2026
నెల్లూరు: రైలు ఢీకొని మహిళ స్పాట్ డెడ్

మనుబోలు రైల్వే స్టేషన్ ఉత్తరం వైపు ఫ్లాట్ ఫామ్ చివరన చెన్నై నుంచి విజయవాడ వెళ్లే లైన్లో గుర్తుతెలియని మహిళ పట్టాలు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని శనివారం సాయంత్రం మృతి చెందింది. వయస్సు సుమారు 50-55 ఏళ్లు ఉండొచ్చని, 5.0అడుగుల ఎత్తు కలిగి చాయా రంగు కలిగి ఉందని రైల్వే ఎస్సై హరి చందన తెలిపారు. మృతురాలు సిమెంట్ రంగుపై బులుగు రంగు సిల్క్ చీర, ఆకుపచ్చ పావడాను ధరించి ఉందని అన్నారు.


