News June 28, 2024

నేడు కొండగట్టులో జ్యేష్ఠాభిషేకం

image

మాల్యాల మండలం కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం ఉదయం స్వామి వారికి సుగంధ ద్రవ్యాలు కలిపిన 108 కలశాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించి పూజలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం గ్రీష్మ రుతువులో వేసవి తాపం తగ్గి వర్షాలు సమృద్ధిగా కురవాలని స్వామి వారికి జ్యేష్ఠాభిషేకం చేస్తామని అర్చకులు కపిందర్ పేర్కొన్నారు.

Similar News

News December 23, 2025

కరీంనగర్‌: ప్రాణదాతగా ‘108’ అంబులెన్స్‌ సేవలు

image

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ‘108’ అంబులెన్స్‌ సేవలు ప్రాణదాతగా నిలుస్తున్నాయి. ప్రమాదాలు, గర్భిణీలను ఆసుపత్రులకు చేర్చడం, తదితర సేవలలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. KNR జిల్లాలో ప్రస్తుతం 16 అంబులెన్సులు, 33మంది ఈఎంటీలు, 35 మంది పైలట్లు నిరంతరం అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్నారు. గత 20 నెలల కాలంలోనే జిల్లా వ్యాప్తంగా 56,171 మంది బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించి ప్రాణాలను కాపాడటం విశేషం.

News December 23, 2025

కరీంనగర్‌: ప్రాణదాతగా ‘108’ అంబులెన్స్‌ సేవలు

image

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ‘108’ అంబులెన్స్‌ సేవలు ప్రాణదాతగా నిలుస్తున్నాయి. ప్రమాదాలు, గర్భిణీలను ఆసుపత్రులకు చేర్చడం, తదితర సేవలలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. KNR జిల్లాలో ప్రస్తుతం 16 అంబులెన్సులు, 33మంది ఈఎంటీలు, 35 మంది పైలట్లు నిరంతరం అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్నారు. గత 20 నెలల కాలంలోనే జిల్లా వ్యాప్తంగా 56,171 మంది బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించి ప్రాణాలను కాపాడటం విశేషం.

News December 23, 2025

KNR: షోకాజ్ నోటీసులపై అదనపు కలెక్టర్‌కు ‘టీటీయూ’ వినతి

image

పంచాయతీ ఎన్నికల విధులకు హాజరుకాని ఉపాధ్యాయులకు జారీ చేసిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని కోరుతూ తెలంగాణ టీచర్స్ యూనియన్ (TTU) నాయకులు సోమవారం అదనపు కలెక్టర్, డీఈవో డాక్టర్ అశ్వినీ తనజీ వాంక్డేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ.. అనారోగ్యం లేదా ఇతర సహేతుకమైన (జెన్యూన్) కారణాలతో విధులకు రాలేని వారికి తప్పనిసరిగా మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చారు.