News February 23, 2025

నేడు కొమురవెల్లి మల్లన్న ఆరో ఆదివారం

image

కొమురవెల్లి బ్రహ్మోత్సవాల్లో నేడు ఆరో ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. వరంగల్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ తదితర పూర్వ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. కొమురవెల్లి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు చెల్లించుకోనున్నారు.

Similar News

News December 1, 2025

NGKL: పడమటి అంజనేయ స్వామి దేవాలయంలో సీఎం పూజలు

image

జిల్లా పర్యటనలో భాగంగా మక్తల్ పట్టణంలోని పడమటి అంజనేయ స్వామి దేవాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఎం పేరిట ప్రత్యేకంగా అర్చన చేసి ఆయనను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రులు జూపల్లి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News December 1, 2025

NGKL: సోషల్ మీడియా పోస్టులపై పోలీసుల నిఘా

image

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటన, ఎదుటివారిని కించపరిచే విధంగా పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ హెచ్చరించారు. రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించే విధంగా పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News December 1, 2025

NGKL: పార్టీ జెండాలు పక్కన పెట్టి కలిసి ఎన్నికల పోరులో నాయకులు

image

NGKL జిల్లాలో జరుగుతున్న GP ఎన్నికలలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న వివిధ పార్టీల నాయకులు ప్రస్తుతం పార్టీ జెండాలు పక్కన పెట్టి కలిసి పని చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో బిజెపి, BRS పార్టీల నాయకులు కలిసి ఎన్నికలలో పోటీ చేస్తుండగా, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ నాయకులు కలిసి పోటీ చేస్తున్నారు. పదవుల కోసం ఎంతకైనా దిగజారుతారనే విమర్శలు ఉన్నాయి.