News January 24, 2025
నేడు గద్వాలకు మల్లు రవి

గద్వాల జిల్లాకు నేడు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి రానున్నట్లు కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా ఛైర్మన్ నల్లారెడ్డి తెలిపారు. జిల్లాలో అమృత్ 2.0 తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో మల్లు రవితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరవుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు.
Similar News
News October 29, 2025
MHBD: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు కలెక్టర్ సూచన

మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా తుఫానుతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు.
News October 29, 2025
ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

మొంథా తుఫాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని IMD తెలిపింది. ఏపీలోని గుంటూరు, ప్రకాశం, టీజీలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ, యాదాద్రి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. కాగా ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
News October 29, 2025
NRPT: బస్సు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

నారాయణపేట పట్టణానికి చెందిన అంజమ్మ, ఆదివారం పెబ్బేరు బస్టాండ్లో బస్సు రివర్స్ తీసుకుంటున్న క్రమంలో టైర్లు కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆపరేషన్ చేసి రెండు కాళ్లు తొలగించినా, శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ కావడంతో మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.


