News June 21, 2024
నేడు గుంటూరుకు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని

కేంద్ర సహాయమంత్రిగా భాద్యతలు స్వీకరించిన గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నేడు తొలిసారి గుంటూరుకు రానున్నారు. మధ్యాహ్నం 03:30 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ టోల్ ప్లాజా నుంచి శ్రీ కన్వెన్షన్ హాల్ వరకు, కార్యకర్తలతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం.. శ్రీ కన్వెన్షన్ హాల్లో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు.
Similar News
News October 28, 2025
GNT: చందమామ తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు

ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది,”కొకు” గా సుపరిచితుడైన కొడవటిగంటి కుటుంబరావు (1909 అక్టోబర్ 28-1980 ఆగస్ట్ 17) తెనాలిలో జన్మించారు. 50 ఏళ్ల రచనా జీవితంలో 12వేల పేజీలకు మించిన రచనలు చేశారు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించారు.
News October 27, 2025
గుంటూరు జిల్లాలో పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే

మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం పోలీస్ (24×7) కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు చేసిందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
@జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్: 0863-2230100
@ఈస్ట్ సబ్డివిజన్–0863-2223353
@వెస్ట్ సబ్డివిజన్– 0863-2241152 / 0863-2259301
@నార్త్ సబ్డివిజన్–08645-237099
@సౌత్ సబ్డివిజన్–0863-2320136
@తెనాలి సబ్డివిజన్–08644-225829
@తుళ్లూరు సబ్డివిజన్–08645-243265
News October 27, 2025
ANU పరిధిలోని కాలేజీలకు సెలవు

గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మొంథా తుఫాను నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలకు ఈ నెల 29 వరకు మూడు రోజుల సెలవులు ప్రకటిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం తెలిపారు. ఈ ఆదేశాలను తప్పక పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


