News March 16, 2025

నేడు జనగామ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి నేడు జనగామ జిల్లాకు రానున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు 50వేలకు పైనే జనాలు వచ్చేట్లుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఘన్‌పూర్లో దాదాపు రూ.800 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. మ. ఒంటిగంటకు హెలిపాడ్ వద్దకు రేవంత్ చేరుకోనున్నారు.

Similar News

News October 24, 2025

గ్రేటర్ తిరుపతి పై కౌన్సిల్ లో రచ్చ

image

తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభంలోనే గ్రేటర్ తిరుపతి పై చర్చ రచ్చగా ప్రారంభమైంది. మేయర్ శిరీష ప్రతిపాదన పెట్టగానే డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ ప్రతిపాదన ఇప్పటిది కాదని సీఎం కు కృతజ్ఞతలతో ఆమోదం తెలపాలని కోరగా.. వైసీపీ నాయకులు గ్రేటర్ తిరుపతి నినాదాలు, ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.

News October 24, 2025

ఈవీఎం గోదాముల‌ను త‌నిఖీ చేసిన విశాఖ క‌లెక్ట‌ర్

image

చిన‌గ‌దిలిలో ఈవీఎం గోదాముల‌ను కలెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ త‌నిఖీ చేశారు. నెలవారీ త‌నిఖీల్లో భాగంగా శుక్రవారం ఉద‌యం గోదాముల‌ను సంద‌ర్శించిన ఆయ‌న అక్క‌డ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. సీసీ కెమెరాల ప‌నితీరును, ప్ర‌ధాన ద్వారానికి ఉన్న సీళ్ల‌ను ప‌రిశీలించారు. భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌పై అక్క‌డ అధికారులకు, భ‌ద్ర‌తా సిబ్బందికి ప‌లు సూచ‌న‌లు చేశారు.

News October 24, 2025

ఏటూరునాగారం: రోడ్లపై ఆహారం.. బలౌతున్న కోతులు!

image

ఏటూరునాగారం-పస్రా మధ్య జాతీయ రహదారిపై కోతులు మృత్యువాత పడుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రతిరోజు వాహనాల వేగానికి బలౌతున్నాయి. వాహనదారులు రోడ్లపై పడవేసే ఆహారం కోసం వెళ్లే క్రమంలో వాహనాల కింద పడి మృత్యువాత పడుతున్నాయి. అడవుల్లో ఆహారం లభించక రోడ్లపై వాహనదారులు వేసే ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ప్రాణాలు కోల్పోతున్నాయి. రోడ్లపై ఆహారం వేయొద్దని చెప్పిన పట్టించుకోవడం లేదని అటవీ అధికారులు వాపోతున్నారు.