News March 16, 2025

నేడు జనగామ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి నేడు జనగామ జిల్లాకు రానున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు 50వేలకు పైనే జనాలు వచ్చేట్లుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఘన్‌పూర్లో దాదాపు రూ.800 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. మ. ఒంటిగంటకు హెలిపాడ్ వద్దకు రేవంత్ చేరుకోనున్నారు.

Similar News

News November 17, 2025

భూపాలపల్లి: విషాదం.. 7 నెలల గర్భిణి ఆత్మహత్య

image

భూపాలపల్లి(D) గణపురం(M) బుద్ధారంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కరీంనగర్(D) ఇల్లందకుంట మండలానికి చెందిన మౌనిక(23)కు రెండేళ్ల క్రితం ఇక్కడి యువకుడు ప్రశాంత్‌తో వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త, కుటుంబ సభ్యులు నిరంతరం వేధిస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక 7 నెలల గర్భిణిగా ఉన్న మౌనిక ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. మౌనిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News November 17, 2025

భూపాలపల్లి: విషాదం.. 7 నెలల గర్భిణి ఆత్మహత్య

image

భూపాలపల్లి(D) గణపురం(M) బుద్ధారంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కరీంనగర్(D) ఇల్లందకుంట మండలానికి చెందిన మౌనిక(23)కు రెండేళ్ల క్రితం ఇక్కడి యువకుడు ప్రశాంత్‌తో వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త, కుటుంబ సభ్యులు నిరంతరం వేధిస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక 7 నెలల గర్భిణిగా ఉన్న మౌనిక ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. మౌనిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News November 17, 2025

గుంటూరు సౌత్ డివిజన్‌లో ప్రమాద ప్రాంతాల పరిశీలన

image

గుంటూరు సౌత్ సబ్-డివిజన్ డీఎస్పీ భానోదయ 12 ప్రమాద ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) నల్లపాడు, ప్రతిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పరిశీలించారు. లైటింగ్, హెచ్చరిక బోర్డులు, సీసీటీవీలు, వేగ నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్ష జరిపారు. పరిశీలన ఆధారంగా ప్రత్యేక రిపోర్టును ఎస్పీ వకుల్ జిందాల్, NHAIకు పంపనున్నట్లు తెలిపారు. ఎంవీఐ మల్లేశ్వరి, NHAI ఇంజినీర్ దత్తాత్రేయ, సీఐలు వంశీధర్, శ్రీనివాసరావు ఉన్నారు.