News August 22, 2024
నేడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు: జీవన్ రెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1724242970623-normal-WIFI.webp)
రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో BRS తరఫున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ పెద్ద సంఖ్యలో రైతన్నలు హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News February 5, 2025
NZB: పంచాయతీ ఎన్నికలకు సిద్ధమా..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738730430805_728-normal-WIFI.webp)
పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అధికారులు ఎన్నికల సామగ్రిని మండల కేంద్రాలకు పంపించి భద్రపరిచారు. ఆర్మూర్ డివిజన్లో 180 పంచాయతీలుండగా బోధన్ డివిజన్ 152, నిజామాబాద్ డివిజన్లో 213 గ్రామ పంచాయతీలున్నాయి. ఇప్పటికే పలువురు ఆశావాహులు పార్టీ నేతలను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
News February 5, 2025
NZB: శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోండి: శైలి బెల్లాల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738726403983_50139228-normal-WIFI.webp)
కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం నిర్వహించే అంతర్ జిల్లాల యువ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా HYDలో ఈనెల 11 నుంచి 15 వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతీయువకులకు నైపుణ్య శిక్షణ ఉంటుందని NYK కో ఆర్డినేటర్ శైలి బెల్లాల్ తెలిపారు. ఎంపికైన 25 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని, శిక్షణలో పాల్గొనే ఆసక్తి ఉన్న వారు తమ వివరాలను 91004 35410 నంబర్ కు వాట్సాప్ చేయాలని ఆమె సూచించారు.
News February 5, 2025
NZB: రైలులోంచి పడి వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738687254783_50486028-normal-WIFI.webp)
రైలులోంచి ప్రమాదవశత్తు జారి పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి శివారులో మంగళవారం సాయంత్రం నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న రైల్లోంచి పడి వ్యక్తి మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.