News April 10, 2025

నేడు నంద్యాల జిల్లాకు వర్ష సూచన

image

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నేడు నంద్యాల జిల్లాలో వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు నిన్న నంద్యాల జిల్లా దొర్నిపాడులో అత్యధికంగా 39.7°C ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది.

Similar News

News February 24, 2026

రాజకీయాల్లోకి వస్తా : దేవ్ జీ

image

అజ్ఞాతం వీడిన తాను త్వరలోనే రాజకీయాల్లో వస్తానని మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ వెల్లడించారు. మంగళవారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆయన తాను ఏ పార్టీలో చేరుతానో ఇప్పటికిప్పుడే చెప్పలేనన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సరైన వేదిక కాదన్న ఆయన త్వరలోనే పార్టీ జీవితంపై ప్రకటన చేస్తానన్నారు. అనారోగ్య కారణంతోనే తాను అజ్ఞాతం వీడానని, వ్యక్తిగత జీవితం కొనసాగించడం కోసం కాదని స్పష్టం చేశారు.

News February 24, 2026

గణపతి అడవిలో లేరు: డీజీపీ

image

మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డి మంగళవారం DGP శివధర్‌ రెడ్డి ఎదుట లొంగిపోయారు. DGP మాట్లాడుతూ.. రెండేళ్లలో 591మంది మావోయిస్టులు లొంగిపోయారని, ప్రస్తుతం అగ్రనేత గణపతి అడవుల్లో లేరని, బయట ఎక్కడో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం ఉందని వెల్లడించారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న 11 మంది TG నేతల్లో కొందరు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు.

News February 24, 2026

కీరదోసలో పండు ఈగ – నివారణ

image

కీరదోసను ఆశించే పండు ఈగలు పువ్వు మొగ్గలపై, లేత పిందెలపైన గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చిన సన్నని పిల్ల పురుగులు కాయను తొలచి, లోపలి గుజ్జును తిని నష్టపరుస్తాయి. దీని వల్ల కాయలు కుళ్లిపోయి దిగుబడి తగ్గిపోతుంది. వీటి నివారణకు లీటరు నీటికి మలాథియాన్‌ 2ml (లేదా) ప్రొఫెనోఫాస్‌ 2ml కలిపి పిచికారీ చేయాలి. ఈ పురుగులను నివారించడానికి విషపు ఎరలను తయారు చేసుకోవాలి.