News April 10, 2025
నేడు నంద్యాల జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ

ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ భేటీ కానున్నట్లు ఆ పార్టీ ట్వీట్ చేసింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా.. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటుగా జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, MLCలు, MLAలు, మాజీ MPలు, మాజీ MLAలు, పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
Similar News
News October 28, 2025
మొంథా తుఫాన్.. వాహనదారులకు బిగ్ అలర్ట్

AP: మొంథా తీవ్ర తుఫాన్ నేపథ్యంలో భారీ వాహనదారులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల తర్వాత నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. వాహనదారులు ముందే సురక్షిత ‘లేబే’ల్లో వాటిని పార్క్ చేసుకోవాలని సూచించింది. అటు ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని మరోసారి హెచ్చరించింది.
News October 28, 2025
ఖమ్మం: రూ.2.6 లక్షలతో జర్మనీలో ఉద్యోగాలు

ఖమ్మం నగరంలోని టేకులపల్లి ITI క్యాంపస్లోని మోడల్ కెరీర్ సెంటర్లో ఈనెల 30న జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాల కోసం ఎన్రోల్మెంట్ డ్రైవ్ జరగనుందని జిల్లా ఉపాధికల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. ITI ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల అనుభవం ఉన్న, 19-30 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఉదయం 10 గంటలకు తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలని, ఎంపికైన వారికి నెలకు రూ.2.6 లక్షల వేతనం ఉంటుందన్నారు.
News October 28, 2025
‘ChatGPT Go’ ఏడాది పాటు ఉచితం!

ఇండియన్ యూజర్లను ఆకర్షించేందుకు ChatGPT కీలక నిర్ణయం తీసుకుంది. ‘ChatGPT Go’ సేవలను ఏడాది పాటు ఉచితంగా అందించేందుకు సిద్ధమైంది. నవంబర్ 4 నుంచి SignUp చేసిన కొత్త యూజర్లకు ఈ అవకాశం లభిస్తుందని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ChatGPT Go ఉపయోగిస్తున్న వారికి కూడా అదనంగా 12 నెలల ఉచిత సేవలు వర్తిస్తాయని తెలిపింది. ఇప్పటికే ఎయిర్టెల్ కూడా తన యూజర్లకు ఏడాది పాటు ‘Perplexity Pro’ని ఫ్రీగా అందించింది.


