News March 24, 2025

నేడు నల్గొండకు మంత్రి కోమటిరెడ్డి 

image

నల్గొండ జిల్లాకు నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రానున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9 గంటలకు నల్గొండలోని మంత్రి క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు. 9.30 గంటలకు అర్జలాబావిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 10.30 గంటలకు తిప్పర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.

Similar News

News March 29, 2025

నల్గొండ: ముగ్గురు పిల్లలు మృతి

image

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో <<15910567>>ముగ్గురు పిల్లలు మృతిచెందిన విషయం తెలిసిందే.<<>> RR జిల్లా తలకొండపల్లికి చెందిన చెన్నయ్య 2012లో నల్గొండ జిల్లా మందాపూర్‌ వాసి రజితను పెళ్లి చేసుకున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో వారంతా భోజనం చేశారు. అయితే రజిత, పిల్లలు పెరుగు, పప్పుతో తినగా చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే తిన్నాడు. శుక్రవారం పొద్దున చూడగా పిల్లలు చనిపోయారు. రజితకు సీరియస్‌గా ఉందని ఆస్పత్రికి తరలించారు.

News March 29, 2025

రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ఏర్పాట్ల పరిశీలన

image

రంజాన్ పండుగ సందర్భంగా నల్లగొండలోని ఈద్గా వద్ద డీఎస్పీ శివరామిరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగ జరుపుకోవాలని కోరారు. ఈద్గా కమిటీ వైస్ ఛైర్మన్ డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణంలో ఎండ వేడిమి, దృశ్య తాగునీరు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారుఈ కార్యక్రమంలో సీఐ రాజశేఖర్ రెడ్డి, ఈద్గా సెక్రటరీ ఫుర్ఖాన్ పాల్గొన్నారు.

News March 28, 2025

పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి కేవీఆర్

image

నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి శుక్రవారం సమీక్షించారు. వేసవి దృష్ట్యా విద్యుత్ సేవలు, సాగు నీరు, త్రాగు నీరు వంటి అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!