News January 27, 2025

నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో మెగా జాబ్ మేళా

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో నేడు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల నోడల్ అధికారి అంజయ్య తెలిపారు. పాక్స్ కాన్ కంపెనీ, కొంగరకలాన్ కంపెనీ హైదరాబాద్ వారు ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. వెయ్యి మందికి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇట్టి అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News February 9, 2025

సినిమా ఆఫర్.. మాజీ CM కూతురికి రూ.4 కోట్లు టోకరా

image

సినిమా ఆఫర్ ఇస్తామంటూ కొందరు ఉత్తరాఖండ్ మాజీ CM రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ కూతురు ఆరుషికి రూ.4 కోట్లకు టోకరా పెట్టారు. ముంబైకి చెందిన వరుణ్, మాన్సీలు నిర్మాతలమంటూ పరిచయం చేసుకున్నారు. విక్రమ్ మాస్సే హీరోగా తెరకెక్కించే మూవీలో కీలక పాత్రతో పాటు లాభంలో 20% షేర్ ఇస్తామని, పెట్టుబడి పెట్టాలని చెప్పారు. ఇది నమ్మి ఆమె విడతలవారీగా రూ.4 కోట్లు ఇచ్చారు. మూవీ ప్రారంభం కాకపోవడంతో మోసం చేశారని కేసు పెట్టారు.

News February 9, 2025

మంచిర్యాల జిల్లాలో నేటి TOP NEWS

image

*అంకుశం వైపు పులి కదలికలు*వైభవంగా వేలాల గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ *బార్‌లో దాడి ఘటనలో ముగ్గురి రిమాండ్*రాజకీయ జోక్యంతో దిగజారుతున్న సింగరేణి*గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

News February 9, 2025

పెద్దాపురంలో డివైడర్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

image

పెద్దాపురంలో డివైడర్ పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి పెద్దాపురం దర్గా సెంటర్ సమీపంలో కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న బస్సు పెద్దాపురంలో ప్రమాదవశాత్తు డివైడర్ మీదకు వెళ్లింది. దీనితో ప్రయాణికులంతా భయాందోళనలకు గురయ్యారు. అయితే బస్సులో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనతో అక్కడ వాహనాలు నిలిచిపోయి, భారీ ట్రాఫిక్ ఏర్పడింది.

error: Content is protected !!