News August 2, 2024
నేడు నెల్లూరుకు రానున్న మంత్రి బీసీ

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు మంత్రి ఆనంతో పాటు అధికారులతో కలిసి రామాయపట్నం పోర్టును సందర్శిస్తారు. అభివృద్ధి పనుల పరిశీలన, సమీక్ష అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు చేరుకుంటారు. పనుల పరిశీలన అనంతరం విజయవాడ బయలుదేరుతారు.
Similar News
News December 17, 2025
నెల్లూరు: మేము ‘సై’.. కానీ మా ప్రాణాలకు రక్షనుందా.!

గంజాయి నిర్మూలనకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. యువత సైతం ముందుకు రావాలని DSP ఘట్టమనేని కోరారు. నగదు ప్రోత్సాహాన్ని సైతం ఆఫర్ చేస్తున్నారు. గంజాయి సమాచారం ఇస్తాం.. మరి మా ప్రాణాలకు రక్షణ ఇవ్వగలరా అని పలువురు ప్రశ్నిస్తున్నారట. పెంచలయ్య హత్యను వారు ఉదహరిస్తున్నారు. గంజాయికి వ్యతిరేకంగా మాట్లాడిన ఓ యువతి సైతం అనంతరం ఆందోళన చెందినట్లు తెలస్తోంది. మరి పోలీసులు యువతకు భరోసా ఇస్తారా.? చూడాలి.
News December 16, 2025
మామా.. మన నెల్లూరును మనమే క్లీన్ చేసుకుందాం..!

నెల్లూరులో పదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి వ్యాపారాన్ని స్థానికుల సమాచారంతో పోలీసులు అడ్డుకున్నారు. సిటీలో గంజాయి నిర్మూలనకు యువత ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఎక్కడన్నా గంజాయి వ్యాపారాలు సాగుతుంటే సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నగదు సైతం ఇస్తామని ప్రకటించారు. యువత గంజాయి వాడకానికి దూరంగా ఉంటే క్రైం తగ్గుతుందని పోలీసులు పేర్కొన్నారు. మీ COMMENT.
News December 16, 2025
ఈనెల 19న ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ డే: కలెక్టర్

ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఈనెల 19న మధ్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతినెలా మూడో శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ డేను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


