News July 5, 2024
నేడు నెల్లూరులోనే మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం నెల్లూరులోని తన క్యాంప్ కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం ప్రజల నుంచి వినతి పత్రాలు, విజ్ఞాపనలు స్వీకరిస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యాలయ ప్రతినిధులు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News October 18, 2025
నెల్లూరు: సా.. గుతున్న పెన్నా రివిట్మెంట్ వాల్ పనులు !

వరద ప్రవాహాల నుంచి పరివాహక ప్రాంతాలు ముంపునకు గురికాకుండా నగరంలోని పెన్నా నది భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో చేపడుతున్న రివిట్మెంట్ వాల్ కాలాతీతం అవుతుంది. ఇటీవల సోమశిల రిజర్వాయర్ నుంచి వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. కాగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పెన్నాకు వరద నీరు భారీగా చేరుతుంది. ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత ముప్పు తప్పుతుందని స్థానికులు పేర్కొన్నారు.
News October 18, 2025
రూ.1కే సిమ్.. రోజుకు 2.5 జీబీ హై స్పీడ్ డేటా

BSNL కొత్త వినియోగదారులకు దీపావళి సందర్భంగా కానుక ప్రకటించినట్లు నెల్లూరు జిల్లా జనరల్ మేనేజర్ అమరేందర్ రెడ్డి తెలిపారు. ఈ ప్యాకేజీలో రూ.1కే సిమ్ అందిస్తూ అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2.5 జీబీ హై స్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ సిమ్ కోసం ఆధార్ ధ్రువీకరణతో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం కానీ ఏజెంట్ల ద్వారా ఈ అవకాశం నవంబర్ 15 వరకు పొందవచ్చు అన్నారు.
News October 18, 2025
పవన్ కళ్యాణ్ వద్దకు చేరిన నెల్లూరు పంచాయితీ

జిల్లా పర్యవేక్షకులు అజయ్ కుమార్ తీరుపై జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జులు పలు విమర్శలు చేశారు. దీంతో డైరెక్ట్గా DCM పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. నెల్లూరు జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జులను శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి రావాలని సందేశాలు పంపారు. దీంతో నెల్లూరు జిల్లాలో రెండు రోజుల క్రితం తిరుగుబాటు జెండా ఎగురవేసిన జనసేన నేతలందరూ శుక్రవారం విజయవాడ బయలుదేరారు.