News May 11, 2024
నేడు పిఠాపురంలో జగన్ పర్యటన

AP: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మధ్యాహ్నం 12.30 గంటలకు ఏలూరు జిల్లా కైకలూరు, మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
Similar News
News December 4, 2025
సమంత-రాజ్ పెళ్లి.. మాజీ భార్య ఎమోషనల్ పోస్ట్

రాజ్-సమంత పెళ్లి చేసుకున్న మూడు రోజులకు రాజ్ మాజీ భార్య శ్యామలి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘నాపై ప్రేమ, మద్దతు చూపిస్తున్న వారికి రిప్లై ఇవ్వలేకపోయినందుకు క్షమించాలి. ఇటీవల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. తిరుగుతూ, వాదించుకుంటూ గడిచిన రోజులు ఉన్నాయి. గత నెల 9న నా జ్యోతిష్య గురువుకు స్టేజ్ 4 క్యాన్సర్ నిర్ధారణ అయింది. నాకు PR టీమ్ లేదు. స్వయంగా రెస్పాండ్ అవుతున్నా. అందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు.
News December 4, 2025
టైర్లు ధ్వంసమైనా, నీటిలోనూ ప్రయాణం ఆగదు

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ <<18465862>>పర్యటన<<>> వేళ ఆయన ప్రయాణించే “ఆరస్ సెనాట్” కారుపై చర్చ జరుగుతోంది. ఇది ప్రపంచంలో అత్యంత సురక్షిత వాహనాల్లో ఒకటి. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ కారు బాంబులు, క్షిపణి దాడులను సైతం తట్టుకుంటుంది. నీటిలో మునిగిపోయినా ఇది తేలి సురక్షిత ప్రాంతానికి చేర్చుతుంది. ప్రత్యేకంగా కస్టమైస్డ్ అయిన ఈ కారు ధర సుమారు రూ.5కోట్లు ఉంటుంది. ఇది సాధారణ పౌరులకు అందుబాటులో లేదు.
News December 4, 2025
వస్తువు కొనేముందు ఓ సారి ఆలోచించండి: హర్ష

అవసరమైన వస్తువులను మాత్రమే కలిగి ఉండే జీవనశైలిని అలవరుచుకోవాలని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా యువతకు సూచించారు. ‘మెరుగైన లైఫ్స్టైల్ కోసం ప్రయత్నిస్తూ చాలా మంది తమ మనశ్శాంతిని కోల్పోతున్నారు. విలాసంగా జీవించడం అంటే ఎక్కువ వస్తువులను కొనడం కాదు. తక్కువ వస్తువులు ఉంటే వాటి నిర్వహణ, శ్రమ కూడా తగ్గుతుంది’ అని అభిప్రాయపడ్డారు. అందుకే వస్తువులను కొనేముందు అవి నిజంగా అవసరమా అని ఆలోచించండి. SHARE IT


