News August 22, 2024

నేడు పీఆర్ డైరెక్టర్ కృష్ణతేజ పర్యటన

image

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ వీఆర్. కృష్ణతేజ గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తొలుత టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో చేపట్టిన ఫీడర్ ఛానల్ పనుల పరిశీలిస్తారు. ఉపాధి హామీ కూలీలతో సమావేశమవుతారు. అనంతరం జయవరం గ్రామంలోని ఉద్యాన పండ్ల తోటల సాగును పరిశీలించి రైతులతో మాట్లాడతారు.

Similar News

News November 14, 2025

17న ఒంగోలులో కలెక్టర్ మీకోసం కార్యక్రమం

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 17వ తేదీన కలెక్టర్ మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. గత సోమవారం కనిగిరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే 17వ తేదీన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జరిగే కలెక్టర్ మీకోసంలో ఆయన పాల్గొననున్నారు.

News November 14, 2025

17 నుంచి ప్రకాశం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం

image

ఈనెల 17వ తేదీ నుంచి చేపట్టే చర్మరోగ పరీక్షల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం ఒంగోలు ప్రకాశం భవనంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఏ రోగమైనా ప్రారంభ దశలోనే గుర్తిస్తే తగిన జాగ్రత్తలు, వైద్యం అందించేందుకు వీలుగా ఉంటుందన్నారు.

News November 14, 2025

సెల్ ఫోన్ వద్దు – పుస్తకం ముద్దు: ప్రకాశం కలెక్టర్

image

విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి, పుస్తకాలకు చేరువ కావాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని శాఖ గ్రంథాలయంలో శుక్రవారం జిల్లా గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, మేయర్ గంగాడ సుజాత, పలువురు అధికారులు పాల్గొన్నారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు.