News February 2, 2025
నేడు పుంగనూరుకు రానున్న జనసేన అగ్రనాయకత్వం

సోమల ZP హైస్కూల్లో ఇవాళ ‘జనంలోకి జనసేన’ భారీ బహిరంగ సభ జరగనున్న విషయం తెలిసిందే. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుతోపాటూ పార్టీ అగ్రనాయకత్వం తరలిరానున్నారు. నాయకులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. బహిరంగ సభలో నేతలు ఏం మాట్లాడుతారన్న చర్చ ఆసక్తిగా మారింది. టిడ్కో ఛైర్మన్ అజయ్, తిరుపతి MLA ఆరిని శ్రీనివాస్, ఉ.చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్లు హాజరుకానున్నారు.
Similar News
News November 17, 2025
పక్కా ప్లాన్తో మర్డర్.. కుప్పంలో దృశ్యం-3

దృశ్యం సినిమాను తలపించేలా కుప్పంలో శ్రీనాథ్ను పక్కా ప్లాన్తో <<18306471>>హత్య <<>>చేశారు. గత నెల 16, 18, 27వ తేదీల్లో శ్రీనాథ్ కుప్పం వచ్చాడు. ‘నీకు డబ్బులు ఇస్తా. కానీ కుప్పం వచ్చేటప్పుడు సెల్ ఫోన్ ఇంట్లోనే పెట్టాలి. కుప్పం రైల్వేస్టేషన్లో దిగగానే ఎవరు గుర్తుపట్టని విధంగా తలకు టోపీ, మాస్క్ వేసుకో. సీసీ కెమెరాల కంట పడకుండా రావాలి’ అని ప్రభాకర్ చెప్పాడు. అలాగే చేయడంతో శ్రీనాథ్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
News November 17, 2025
చిత్తూరు పోలీసులకు అందిన 38 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 38 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిని చట్టప్రకారం విచారించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు.
News November 17, 2025
చిత్తూరు పోలీసులకు అందిన 38 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 38 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిని చట్టప్రకారం విచారించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు.


