News May 3, 2024
నేడు ప్రకాశం జిల్లాకు అధినేతలు

ఇవాళ ప్రకాశం జిల్లాకు జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రానున్నారు. కూటమి అభ్యర్థులను మద్దతుగా గిద్దలూరులో ఏర్పాటు చేసిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొదిలిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం జగన్ కనిగిరిలో పర్యటించనున్నారు. దీంతో జిల్లాలో పార్టీ అధినేతలు వస్తుండటంతో అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
Similar News
News September 19, 2025
తెరపైకి బూచేపల్లి.. అసలేం జరుగుతోంది?

మద్యం కుంభకోణం కేసు గురించి ప్రకాశం జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒంగోలు వైసీపీ MP అభ్యర్థిగా పోటీచేసిన చెవిరెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దర్శి MLA బూచేపల్లి పేరు ఈ కేసులో వినిపిస్తోంది. మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉదంటూ సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. డబ్బులు బూచేపల్లికి చేరాయని ఆరోపిస్తుండగా.. నిజంగా ఆయన పాత్ర ఉందా? లేక కావాలనే చేర్చారా? అనేది తేలాల్సి ఉంది.
News September 19, 2025
నేడు ప్రకాశం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం

ప్రకాశం జిల్లాలో శుక్రవారం పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటన విడుదల చేసింది. జిల్లాకు వరుసగా మూడు రోజులపాటు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.
News September 19, 2025
IT కోర్ సెంటర్ కంట్రోల్ రూమ్ను సందర్శించిన SP

జిల్లా పోలీస్ కార్యాలయంలో SP హర్షవర్ధన్ రాజు గురువారం IT కోర్ సెంటర్, కంట్రోల్ రూమ్ సెంటర్లను సందర్శించారు. సిబ్బంది పని తీరు, విధులపై ఆరా తీశారు. CCTNS, CDR, సైబర్ క్రైమ్ అప్డేట్స్, అప్లికేషన్లపై సిబ్బందితో చర్చించారు. పలు ఫైల్స్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తునకు ఉపయోగపడే ఆధారాలను త్వరితగతిన అందించాలన్నారు.