News February 24, 2025

నేడు భద్రాచలంలో గిరిజన దర్బార్‌: ITDA PO

image

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి సమస్యలకు సంబంధించిన అంశాలను లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలన్నారు. సంబంధిత యూనిట్ అధికారులు ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని పేర్కొన్నారు.

Similar News

News November 12, 2025

LLM స్పాట్ అడ్మిషన్లకు గైడ్‌లైన్స్ విడుదల

image

రాష్ట్రవ్యాప్తంగా LLM కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లకు అధికారులు గైడ్‌లైన్స్ విడుదల చేశారు. అడ్మిషన్లు మెరిట్ ఆధారంగానే నిర్వహిస్తామన్నారు. కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లకు నోటిఫికేషన్ గురువారం విడుదల చేస్తామన్నారు. కాలేజ్ లింక్ ద్వారా స్పాట్ రిజిస్ట్రేషన్లను 17వ తేదీ వరకు చేసుకోవాలని, సీట్ల కేటాయింపు జాబితాను 18న విడుదల చేస్తామని, 19వ తేదీ మ.12 గంటల వరకు కళాశాలలో రిపోర్టు చేయాలన్నారు.

News November 12, 2025

ఒక్కో అంతస్తు ఎన్ని అడుగులు ఉండాలి?

image

ఇంటి నిర్మాణంలో ఒక్కో అంతస్తు ఎత్తు కనీసం 10.5 నుంచి 12 అడుగుల మధ్య ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఈ కొలత పాటించడం వల్ల ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయంటున్నారు. ‘ఇది ఇంట్లో ప్రాణశక్తి ప్రవాహాన్ని పెంచి, నివాసితులకు ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. తక్కువ ఎత్తు ఉన్న అంతస్తులు నిరుత్సాహాన్ని, ఇరుకుతనాన్ని కలిగిస్తాయి’ అని తెలుపుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 12, 2025

HYD: మంచినీరు సరఫరా.. లెక్కల్లోకి రాని 33% నీరు..!

image

మహానగర పరిధిలో జలమండలి మంచి నీరు సరఫరా చేస్తోంది. సరఫరా కోసం దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి, భారీగా వ్యయం ఖర్చు చేస్తోంది. అయితే.. నీటిలో 33% లెక్కల్లోకి రాకుండా పోతుంది. ఇది జలమండలిపై ప్రభావం చూపుతుంది. కోట్ల మందికి తాగునీటి సరఫరా చేస్తుండగా, లీకేజీలతో పాటు, HYDలో పలుచోట్ల నీటి లెక్కలు తప్పుతున్నాయి.