News February 24, 2025

నేడు భద్రాచలంలో గిరిజన దర్బార్‌: ITDA PO

image

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి సమస్యలకు సంబంధించిన అంశాలను లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలన్నారు. సంబంధిత యూనిట్ అధికారులు ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని పేర్కొన్నారు.

Similar News

News November 17, 2025

WONDER: ఒకేలా ఇద్దరి ఫింగర్‌ప్రింట్స్!

image

ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. కానీ తొలిసారి UP కాన్పూర్‌లో కవలలు ప్రబల్, పవిత్ర మిశ్రాల ఫింగర్‌ప్రింట్లు, రెటీనా సరిపోలినట్లు తెలుస్తోంది. ఒకరి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయగా మరొకరిది డియాక్టివేట్ అవడంతో ఇది తెలిసింది. జన్యుపరంగా కవలల్లోనూ ఇలా పూర్తిగా మ్యాచ్ అవడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక లోపమా, నిజంగానే బయోమెట్రిక్స్ సేమ్ ఉన్నాయా? అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.

News November 17, 2025

WONDER: ఒకేలా ఇద్దరి ఫింగర్‌ప్రింట్స్!

image

ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. కానీ తొలిసారి UP కాన్పూర్‌లో కవలలు ప్రబల్, పవిత్ర మిశ్రాల ఫింగర్‌ప్రింట్లు, రెటీనా సరిపోలినట్లు తెలుస్తోంది. ఒకరి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయగా మరొకరిది డియాక్టివేట్ అవడంతో ఇది తెలిసింది. జన్యుపరంగా కవలల్లోనూ ఇలా పూర్తిగా మ్యాచ్ అవడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక లోపమా, నిజంగానే బయోమెట్రిక్స్ సేమ్ ఉన్నాయా? అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.

News November 17, 2025

14,967 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

image

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయల్లో 14,967 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. PGT(2,996), ప్రైమరీ టీచర్(2,684), TGT(6,215), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(1,312)తో పాటు మరికొన్ని ఉద్యోగాలున్నాయి. ఈ జాబ్స్‌కు CBSE తొలుత ఉమ్మడి పరీక్ష నిర్వహించనుంది. రెండో దశలో పోస్టులను బట్టి ఎగ్జామ్, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్టుతో ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ DEC 4.
* వెబ్‌సైట్: <>https://www.cbse.gov.in/<<>>