News January 31, 2025
నేడు మండల స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్: DEO

పదో తరగతి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ మండల స్థాయి పరీక్షలు ఈనెల 31న ఎమ్మార్సీ కార్యాలయంలో నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. పాఠశాల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరు కావాలని చెప్పారు. ప్రతి మండలం నుంచి ప్రతిభ చూపిన ముగ్గురు విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేయాలని పేర్కొన్నారు.
Similar News
News November 5, 2025
NEET-SS దరఖాస్తులు ప్రారంభం

NEET-SS దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. DM/MCh, DrNB తదితర సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు ఈ నెల 25 వరకు NBEMS వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 26, 27 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 22న అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి. ఫలితాలను 2026 జనవరి 28 లోపు వెల్లడిస్తారు. పీజీ చేసిన వారు(MD/MS/DNB) దరఖాస్తుకు అర్హులు.
News November 5, 2025
ప్రకాశం: ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త

రాష్ట్రంలో ఇల్లులేని పేదలకు కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా గృహాలను మంజూరు చేయనుంది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులను గుర్తించేందుకు ఇప్పటికే జిల్లాలో సర్వే ప్రారంభించారు. తాజాగా సర్వే <<18185186>>గడువును నవంబర్ 30 వరకు<<>> పొడిగించినట్లు ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. గృహాల మంజూరు కోసం జాబ్ కార్డు, రేషన్, ఆధార్ కార్డులతో పాటు స్థానిక అధికారులను సంప్రదించాలన్నారు.
News November 5, 2025
రాష్ట్ర భవిష్యత్తుకే తలమానికం: మంత్రి డోలా

విశాఖ వేదికగా జరగనున్న భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భవిష్యత్తుకు తలమానికం కానుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొనారు. AU ఇంజినీరింగ్ గ్రౌండ్లో ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. 40 పైచిలుకు దేశాల నుంచి వందల సంఖ్యలో వివిధ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రానికి రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగావకాలు వస్తాయన్నారు.


